Saturday, 15 February 2020

‘సాహో’ టెలివిజన్ ప్రీమియర్.. టీఆర్పీ పగిలిపోయింది!

‘బాహుబలి’ చిత్రంతో పాన్-ఇండియా స్టార్‌గా మారిన రెబల్ స్టార్ ప్రభాస్.. ‘సాహో’ సినిమాతో ఎంత హైప్ క్రియేట్ చేశారో చెప్పాల్సిన అవసరంలేదు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ వల్ల హిందీ సినిమాలకు పోటీగా ‘సాహో’కు కలెక్షన్లు వచ్చాయి. నిజం చెప్పాలంటే ఒక్క హిందీలోనే ఈ సినిమా లాభాలు ఆర్జించింది. అయితే, కిందటేడాది ఆగస్టు 30న విడుదలైన ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులకు ఇప్పటికీ మక్కువ పోలేదు. దీనికి నిదర్శనం ‘సాహో’ టెలివిజన్ ప్రీమియర్‌కు వచ్చిన టీఆర్పీ. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ‘సాహో’ హిందీ వర్షన్ జీ సినిమా ఛానెల్‌లో ప్రసారమైంది. రాత్రి 8 గంటలకు ‘సాహో’ టెలివిజన్ ప్రీమియర్‌ను జీ సినిమా ప్రసారం చేసింది. దీనికి టీఆర్పీ రేటింగ్ అదిరిపోయింది. బ్రాడ్‌కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) విడుదల చేసిన నివేదిక ప్రకారం ‘సాహో’ టెలివిజన్ ప్రీమియర్ 128.20 లక్షల వ్యూయర్‌షిప్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఇది చాలా ఎక్కువ. ఇది చూసి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. Also Read: వాస్తవానికి ‘సాహో’ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫాంలలో ఎప్పుడో అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు కిందటేడాది అక్టోబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక హిందీ వర్షన్‌ను డిసెంబర్ 8న నెట్‌ఫ్లిక్స్‌లో పెట్టారు. అయినప్పటికీ జనవరి 26న ప్రసారమైన టెలివిజన్ ప్రీమియర్ ఆ స్థాయిలో టీఆర్పీని సొంతం చేసుకోవడం విశేషం. హిందీలో ప్రభాస్‌కు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పే మరో ఉదాహరణ ఇది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/31Wq5pj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...