చాలా కాలం తర్వాత పవర్స్టార్ ఓ చక్కటి కాన్సెప్ట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘పింక్’ సినిమా రీమేక్లో పవన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న దిల్ రాజు, బోనీ కపూర్లపై పవన్ ఆగ్రహం వ్యకం చేశారట. ఎందుకంటే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ను చెప్పాపెట్టకుండా మొదలుపెట్టేశారు. సెట్స్లో బ్లాక్ దుస్తుల్లో పవన్ నడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. నిన్న తొలి షెడ్యూల్ పూర్తవడంతో పవన్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే సెట్స్లోని ఫొటోలు లీక్ అవడంపై పవన్ ఫైర్ అయ్యారట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందుకు నిర్మాతలపై మండిపడినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దాంతో సెట్స్లో భారీ సెక్యూరిటీని విధించినట్లు తెలుస్తోంది. ‘పింక్’ సినిమాను ఇప్పటికే నిర్మాత బోనీ కపూర్ తమిళంలో రీమేక్ చేశారు. అజిత్ లాయర్ పాత్ర పోషించిన ఈ సినిమాను ‘నేర్కొండ పార్వాయి’గా తమిళంలో తెరకెక్కించారు. అజిత్ కూడా ఈ సినిమాలో గుబురు గెడ్బంతో కనిపించారు. READ ALSO: అయితే, తెలుగులో ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ టైటిల్ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ టైటిల్తో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. బోనీ కపూర్తో కలిసి ఈ సినిమాను దిల్ రాజు తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ‘ఎంసీఏ’ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38u1iuH
v
No comments:
Post a Comment