Wednesday, 22 January 2020

120 కోట్ల పారితోషికమా.. ఇది టూ మచ్ భయ్యా!

ఏడాదిలో వరుసగా నాలుగైదు సినిమాలు చేసే కెపాసిటీ ఉన్న హీరో ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్. ఆయన నటించే అన్ని సినిమాలు దగ్గరగా రూ.100 కోట్లు రాబడుతుంటాయి. అదీకాకుండా ఈ మధ్యకాలంలో ఆయనకు ఒక్క ఫ్లా్ప్ కూడా లేదు. అందుకే సినిమాకు పారితోషికాన్ని కూడా పెంచేశారు. ఇటీవల ‘గుడ్‌న్యూస్’ సినిమాతో మంచి విజయం అందుకున్న తన తర్వాతి సినిమాను ఆనంద్ ఎల్ రాయ్‌తో కలిసి చేయబోతున్నారట. ఈ సినిమా కోసం అక్షయ్ తీసుకునే పారితోషికం అక్షరాలా రూ.120 కోట్లు అట. ఇందులో తమిళ స్టార్ ధనుష్‌ కూడా నటించనున్నారట. సారా అలీ ఖాన్ కథానాయికగా నటించనున్నారట. అక్షయ్ కుమార్ ఏ విషయంలోనైనా రాజీ పడతారేమో కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కి దగ్గరు. అదీకాకుండా ఈ రోజుల్లో ఆయన సినిమాలు ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పిస్తున్నాయి. డిజిటల్, శాటిలైట్ రైట్స్ కూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. ఆయన నటించే ప్రతీ సినిమాకు మంచి స్పందన వస్తున్నప్పుడు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. READ ALSO: అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇదే ఏడాది సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. అదీకాకుండా ఎన్నో ఏళ్లుగా మోస్ట్ బ్యాంకబుల్ స్టార్‌గా అక్షయ్‌కు గుర్తింపు ఉంది. 2019లో విడుదలైన ఆయన సినిమాలన్నీ హిట్లే. ఇటీవల విడుదలైన ‘గుడ్ న్యూస్’ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.200 కోట్లు సాధించింది. ‘కేసరి’ సినిమా రూ.154 కోట్లు, ‘మిషన్ మంగళ్’ సినిమా రూ.202 కోట్లు,‘హౌస్‌ఫుల్ 4’ సినిమా రూ.194 కోట్లు రాబట్టాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన 2019 హయ్యస్ట్ పెయిడ్ నటుల్లో అక్షయ్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం అక్షయ్ చేతిలో ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీ బాంబ్’, ‘పృథ్వీరాజ్’ సినిమాలు ఉన్నాయి. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38sEU4R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...