జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఓ చక్కటి సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైందనగా ఆమెకు సినిమా టీం నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. చివరి నిమిషంలో కీర్తి సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. ఇందుకు కారణం కీర్తి బరువు తగ్గడం ఒకటైతే రెండోది ఆమె అజయ్ దేవగణ్ కంటే వయసులో చాలా చిన్నది కావడం. సినిమాలో కీర్తి పాత్ర అజయ్ దేవగణ్కు భార్యగా నటించడం. అయితే షూటింగ్ అయ్యాక ఓసారి అజయ్, కీర్తిని పక్క పక్కన చూస్తే ఏ యాంగిల్లోనూ భార్యాభర్తలుగా లేరట. దాంతో కీర్తికి బదులు మరో నటిని ఎంపిక చేసుకుంటే మంచిదని దర్శకుడు అమిత్ రవీంద్రనాథ్, నిర్మాత బోనీ కపూర్ అనుకున్నారట. ఇందుకు కీర్తి కూడా సరేననడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్రలో ప్రముఖ నటి ప్రియమణిని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇందులో అజయ్ భార్య పాత్రలో సరిగ్గా సరిపోతారని అనుకున్నారట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 1950లో భారతీయ ఫుట్ బాల్ టీం కోచ్గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. READ ALSO: అయితే ఈ విషయంపై కీర్తి సురేష్ టీం ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చింది. కీర్తి సురేష్ సినిమా నుంచి తప్పుకోలేదని తెలిపింది. మరోపక్క కీర్తి సురేష్ పట్ల జరిగిన అంశంపై ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో ఎవరికి ఏ పాత్ర నప్పుతుందో ముందే తెలియాలని, తీరా తీసుకున్నాక షూటింగ్ పూర్తయ్యాక మరో నటిని ఎంపిక చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. క్యాస్టింగ్ డైరెక్టర్ తప్పిదం వల్ల కీర్తి సురేష్ ఓ మంచి సినిమాను పోగొట్టుకోవాల్సి వస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. READ ALSO:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/369NJz1
v
No comments:
Post a Comment