Wednesday, 15 January 2020

డార్లింగ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కొత్త సినిమా అప్‌డేట్‌ వచ్చేస్తోంది..!

సాహో సినిమాతో నిరాశపరిచిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ కొద్ది రోజులుగా హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌, ఆ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. అయితే భారీ స్థాయిలో రిలీజ్ కావటంతో ఉత్తరాదిలో మంచి వసూళ్లు సాధించటంతో కమర్షియల్‌గా మాత్రం సాహో సక్సెస్‌ అయ్యింది. సాహో తరువాత జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్‌. పీరియాడిక్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్, సాహో సెట్స్ మీద ఉండగానే ప్రారంభమైంది. అయితే సాహో రిలీజ్‌ తరువాత షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చాలా సమయం తీసుకున్నాడు ప్రభాస్‌. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. Also Read: తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్ రెడీ అయ్యారు. సంక్రాంతి సంబరాలు మరింత కొనసాగిస్తూ శుక్రవారం (17-01-2020) ఈ ప్రభాస్‌ కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. అయితే అప్‌డేట్‌ ఏంటన్న చర్చ మొదలైంది. కేవలం టైటిల్‌ లోగోను రిలీజ్ చేస్తారా..? లేక ప్రభాస్‌ ఫస్ట్ లుక్‌ కూడా రిలీజ్‌ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Also Read: ప్రభాస్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ సంస్థతో కలిసి ప్రభాస్ పెదనాన కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇటలీ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ జ్యోతీష్కుడిగా కనిపించనున్నాడట. ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఇటలీని తలపించేలా మూడు, నాలుగు సెట్‌లకు కూడా వేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2NrVaLu
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...