కన్నడ బ్యూడీ, తెలుగులో ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిన రష్మిక మందన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్పేట్లో ఉన్న రష్మిక మందన ఇంటిపై 10 మంది ఐటీ అధికారుల బృందం గురువారం సోదాలు నిర్వహించింది. గురువారం ఉదయం 7.30 గంటలకు సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో రష్మిక ఇంట్లో లేరు. ఆమె తల్లిదండ్రులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. రష్మిక నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయాన్ని కొడగు ఎస్పీ సుమన్ డి పన్నేకర్ ఖరారు చేశారు. ప్రస్తుతం రష్మిక హైదరాబాద్లో ఉన్నట్టు ఆమె మేనేజర్ కిరణ్ స్పష్టం చేశారు. ‘‘అర్ధరాత్రి వరకు రష్మిక షూటింగ్లో పాల్గొన్నారు. లేట్ నైట్ ఇంటికొచ్చి పడుకున్నారు. ఐటీ సోదాలు జరిగిన విషయం ఆమెకు తెలీదు’’ అని కిరణ్ చెప్పుకొచ్చారు. కాగా, రష్మిక పన్నులన్నీ పక్కాగా చెల్లించినట్టు ఈ సోదాల్లో తేలింది. ఐటీ అధికారులంతా ప్రైవేట్ క్యాబ్స్లో రష్మిక ఇంటికి చేరుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ప్రస్తుతం రష్మిక ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. తొలిసారి మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సరసన నటించిన రష్మిక.. తన నటనతో మరోసారి మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘భీష్మ’ సినిమాలో నితిన్ సరసన నటిస్తున్నారు. అలాగే, సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన నటించబోతున్నారు. తెలుగులో ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పెద్ద ప్రాజెక్టులు ఈ రెండే. ఇక కన్నడలో ‘పొగరు’, తమిళంలో ‘సుల్తాన్’ సినిమాల్లో నటిస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2u7i4Rn
v
No comments:
Post a Comment