Friday, 24 January 2020

రజినీకాంత్ సినిమా.. కమల్ హాసన్ నిర్మాత!

తమిళనాడు ప్రజలకు ఇది శుభవార్త అనే చెప్పాలి. కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు రెండు కళ్లలాంటివారైన సూపర్‌స్టార్ , విశ్వ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోంది. రాజకీయాల పరంగా వీరిద్దరి మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా.. సినిమా రంగంలో మాత్రం ఇద్దరికీ ఒకేమాట. ఇక వీరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా గురించి చెప్పాలంటే.. ఇటీవల ‘దర్బార్’ సినిమాతో తమిళ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన తలైవా ప్రస్తుతం తన 168వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే 169వ సినిమాకు సన్నాహాలు జరిగిపోతున్నాయని తెలుస్తోంది. తలైవా 169వ సినిమాకు రాజ్‌కమల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలీయాలంటే రజినీ, కమల్ స్పందించాలి. ఒకవేళ ఇది నిజమైతే.. తమిళనాడు ప్రజలకు నిజంగా ఈ సినిమా ఓ పండుగ అవుతుంది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఇద్దరు లెజెండ్స్ కలిసి పనిచేయబోయే సినిమా ఇదే అవుతుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. READ ALSO: ప్రస్తుతం రజినీ నటిస్తున్న సినిమాలో మీన, ఖుష్బూ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, కీర్తి సురేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ అవుతోంది. సిరుతాయ్ సివ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ రజినీ కుర్ర హీరోలా గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు. అందుకే ఆయన తన రాజకీయ ప్రయాణానికి సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయలేకపోతున్నారు. మరోపక్క కమల్ హాసన్ ఇందుకు భిన్నంగా ఉన్నారు. నెమ్మదిగా సినిమాలు చేస్తూ.. తన సమయాన్ని ఎక్కువగా రాజకీయాల కోసం కేటాయిస్తున్నారు. READ ALSO:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RnUgSC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...