జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ, రాజకీయ విశ్లేషకుడు . ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేస్తూ రాజకీయ వర్గాల్లో వేడిపుట్టిస్తున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై హాట్ టాపిక్ నడుస్తోంది. దిశ ఘటనతో ముడిపెడుతూ జగన్ పాలనను ప్రశ్నించడంపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఈ సందర్భంలో ‘ఆడపిల్లల పై అఘాయిత్యాలకు మాతృభాష నిర్లక్ష్యమే కారణం’ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ నిప్పులు చెరిగారు కత్తి మహేష్. ‘మాతృభాషకి దిశ రేప్కి లింకేందిరా నాయనా.. వామ్మో... వాయ్యో! ఈ సోదిగాడికి పిచ్చి పట్టిందిరో’ అంటూ ఫేస్ బుక్లో పవన్ను ఏకిపారేస్తూ వరుస పోస్ట్లు వదలాడు. "క్రిస్టియానిటీని పాటిస్తే, కులం ప్రస్తావన ఉండదు" అని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. అతను కరెక్ట్గా ఆరెస్సెస్ బీజేపీ వాళ్ళ మాటలు మాట్లాడావ్. ఈ దేశంలో ఎవరు ఏమతాన్ని నమ్మినా, అందరూ నిజంగా నమ్మేది కులమేరా సోదినాయాలా’ అంటూ పవన్కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్తో అంటకాగి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా నాశనమైపోయిన వాళ్ళు.. వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ్, చంద్రబాబు నాయుడు. ఎదో జగన్కి చెడ్డపేరు వస్తుందని రాయలసీమలో సైలెంట్గా ఉన్నారుగానీ... సోదినాయాలు వాగుతున్నవాగుడికి ఎవడో ఒకడు ఈపాటికి కొట్టుండేవాడు. పరిఢవిల్లుతాయి. పరిణమిల్లుతాయికి తేడా చెప్పరా సోదినాయాలా.. తరువాత 'ఆముక్తమాల్యద' గురించి మాట్లాడుకుందాం’ అంటూ పవన్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతూ వివాదాస్పద కామెంట్స్ చేశారు కత్తి మహేష్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33NoPEi
v
No comments:
Post a Comment