సెలబ్రిటీలు ఫొటోలు తీయించుకోవడానికి వేలకు వేలు పోసి ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను నియమించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఎంత బాగా రెడీ అయినప్పటికీ ఫొటోలో సరిగ్గా పడకపోతే ఎంత అందంగా ఉన్నా లాభం ఉండదు. అందుకే ఫొటోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే ‘నువ్వు నేను’ హీరోయిన్ మాత్రం తన వాచ్మ్యాన్ని ఫొటోగ్రాఫర్గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆదివారం రాత్రి జీ రిష్తే అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు వెళ్లేందుకు అనిత ఎరుపు రంగు చీరలో చాలా సెక్సీగా తయారయ్యారు. ఇలాంటి వేడుకలకు వెళ్లే ముందు సెలబ్రిటీలు ఫొటోషూట్లు తీయించుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ అనిత మాత్రం ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ చేత కాకుండా తన ఇంటి వాచ్మ్యాన్ చేత ఫొటోలు తీయించుకుంది. అంతేకాదు ఇక నుంచి తన ఫొటోలన్నీ అతనే తీస్తాడని తెలిపింది. దాంతో అనిత సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అయిపోయారు. అనిత మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. తన వాచ్మ్యాన్లో మంచి ఫొటోగ్రాఫర్ ఉన్నాడని గుర్తించి అతనికి కొత్త జీవితాన్ని ప్రసాదించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. తెలుగులో ‘నువ్వు నేను’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన అనిత.. ఆ తర్వాత వచ్చిన ‘శ్రీరామ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘నేనున్నాను’, ‘మనలో ఒక్కడు’ తదితర సినిమాల్లో నటించారు. పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. అయితే అనితకు బుల్లి తెర నటిగానే మంచి పేరుంది. ఆమె నటించిన ధారావాహికలకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2RyRdYh
v
No comments:
Post a Comment