Monday, 9 December 2019

షాకింగ్.. ‘ఆర్ ఆర్ ఆర్’ భామ బండారం బయటపడింది

ఆదివారం రాత్రి ముంబయిలో స్టార్ స్క్రీన్ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ ప్రముఖుల కార్తిక్ ఆర్యన్, ఆలియా భట్, దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, అనన్య పాండే తదితరులు వేడుకకు హాజరై సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ బ్యూటీ అసలు బండారం బయటపడింది. ‘గల్లీ బాయ్’ సినిమాకు గానూ ఆలియాకు ఉత్తమ నటిగా అవార్డు దక్కింది. అయితే షో ప్రారంభం అయ్యాక తీసుకోవాల్సిన అవార్డు ఆలియా షో ప్రారంభం కాకముందే తీసుకున్నారు. పైగా ఎవ్వరికీ తెలీకుండా షో జరుగుతున్న ప్రదేశం వెనక డోర్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా వర్గాలు వెంటనే అక్కడికి చేరుకుని ఆలియా ఫొటోలు క్లిక్‌మనిపించాయి. దాంతో చేసేదేంలేక ఆలియా ఫొటోలకు పోజులిచ్చింది. ఆ సమయంలో తీసిన వీడియోను ప్రముఖ సెల్రబిటీ ఫొటోగ్రాఫర్ విరాల్ భయానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆలియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆలియా అవార్డు తీసుకున్న విషయాన్ని షో ప్రారంభమైన రెండు గంటల తర్వాత టీవీలో ప్రసారం చేయాలని ఆలియా మేనేజర్ మీడియాను హెచ్చరించారట. దాంతో దొరికిందే సందు అనుకుని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ ఆలియా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘పోన్లే కనీసం ఈ పనైనా ఎవ్వరికీ తెలీకుండా చేస్తోంది. ఆమాత్రమైన సిగ్గు ఉన్నందుకు ఆనందిస్తున్నాను. దీన్నే అవార్డ్ ఫిక్సింగ్ అంటారు’ అని కామెంట్ చేశారు. అయితే ఆలియా ఇలా ఎందుకు చేశారో మాత్రం తెలియలేదు. మీడియాను హెచ్చరించి, అవార్డు తీసుకుని వెనక నుంచి వెళ్లిపోవడం కరెక్ట్‌ కాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36is3kI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...