Monday, 9 December 2019

‘సూర్యుడివో చంద్రుడివో’ సాంగ్: మెలోడి బాగుంది కానీ..!

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దిల్‌ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫ‌స్ట్ సాంగ్‌ ‘మైండ్ బ్లాక్’కి మంచి స్పందన వచ్చింది. అలాగే, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌పై విమర్శలు కూడా వచ్చాయి. ఏది ఎలా ఉన్నా ఈ పాట అయితే యూట్యూబ్‌లో దూసుకుపోయింది. మొదట మంచి ఊపున్న పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక మంచి మెలోడిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ‘సూర్యుడివో చంద్రుడివో’ అంటూ సాగే ఈ పాటను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. Also Read: ఈ పాటను ప్రముఖ పంజాబీ సింగ్ బి ప్రాక్ ఆలపించారు. ఆయన తెలుగులో పాట పాడటం ఇదే తొలిసారి. తెలుగులోనే కాదు సౌత్ ఇండియాలో ఆయన పాడటం కూడా ఇదే మొదటిసారి. తన తొలి తెలుగు పాటతోనే ప్రాక్ ఆకట్టుకున్నారు. అయితే, దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన ట్యూన్ మాత్రం కొత్తగా ఏమీ లేదు. దానిలో పాత వాసనలు వినిపిస్తున్నాయి. రామజోగయ్య శాస్త్రి ఎప్పటిలానే మంచి సాహిత్యం అందించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36ez0n1
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...