Monday, 9 December 2019

రేపిస్ట్‌లపై కేసులు పెట్టాల్సిన అవసరమేంటి: అలనాటి నటి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా హత్య కేసుపై తాజాగా అలనాటి బాలీవుడ్ నటి స్పందించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదని అంటున్నారు. అంతేకాదు ఆమె అభిప్రాయాలు కాస్త షాకింగ్‌గా, కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ‘నా అభిప్రాయం ప్రకారం ఇలాంటి దారుణమైన ఘటనలకు పాల్పడేవారిని అస్సలు క్షమించకూడదు. అదే విధంగా ఒకరి ప్రాణాన్ని తీసే హక్కు కూడా మనకు లేదు. రేపిస్ట్‌లకు జీవిత ఖైదు శిక్షలు వేయాలి. ఇలాంటి కేసుల్లో లీగల్ ప్రాసెస్ ఫాలో అవ్వకూడదు. రేపిస్ట్‌లు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినప్పుడు వారిపై కేసులు పెట్టడం ఎందుకు? అలా చేయడం వల్ల ప్రజల సొమ్ము వేస్ట్ అవతుంది. కాబట్టి ఎలాంటి లీగల్ ప్రాసెస్‌లను ఫాలో అవ్వకుండా రేపిస్ట్‌లకు జీవిత ఖైదు శిక్షలు వేస్తే మంచిది’ అని తెలిపారు. వహీదా వ్యాఖ్యలు కాస్త ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అలా చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు అని వ్యతిరేకిస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎందరో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. దిశ నిందితులను ఇటీవల తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు పోలీసులను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ వార్త గురించి అంతర్జాతీయ పత్రికలు, మీడియా కూడా కవర్ చేయడం విశేషం. ఇకమీదట ఆడపిల్లలపై ఇలాంటి ఘోరమైన నేరాలను పాల్పడేవారిని ఇలాగే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36esSLs
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...