బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో ప్రభాస్. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ చేసిన సాహో కమర్షియల్గా సక్సెస్ అయినా ప్రభాస్ ఇమేజ్ తగ్గ స్థాయిలో మాత్రం అలరించలేక పోయింది. దీంతో తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ మ్యాన్లీ స్టార్. సాహో తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్. సాహో షూటింగ్ జరుగుతుండగానే పట్టాలెక్కిన ఈ సినిమాను ఎక్కువ భాగం ఇటలీలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. అయితే సాహో రిజల్ట్ చూశాక, ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అందుకే హైదరాబాద్లోనే సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు చిత్రయూనిట్. సాహో రిలీజ్ తరువాత గ్యాప్ తీసుకున్న ప్రభాస్ రిలాక్స్ అయ్యేందుకు విదేశాలకు వెళ్లిపోయాడు. Also Read: కొంత కాలం అక్కడే ఉండి వచ్చిన ప్రభాస్ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ను తిరిగి ప్రారంభించాడు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్కు మరోసారి బ్రేక్ పడినట్టుగా తెలుస్తోంది. ఈ సారి బ్రేక్ ఇవ్వడానికి కారణం కూడా ప్రభాసేనట. ఇన్నాళ్లు విదేశాల్లో ఎంజాయ్ చేసిన ప్రభాస్ కాస్త బరువు పెరగాడు. దీంతో పాత్రకు తగ్గట్టుగా తిరిగి కనిపించేందుకు ప్రభాస్ కాస్త సమయం కావాలని కోరాడట. Also Read: చిన్న బ్రేక్ తీసుకొని ఫిట్గా తయారైన తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. క్యారెక్టర్ కోసం ఎంత కష్టమైన సరే అనే ప్రభాస్, ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం కూడా భారీగానే కసరత్తులు చేస్తున్నాడట. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తో కలిసి ప్రభాస్ పెదనాన కృష్ణం రాజు గోపీ కృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35k2oHQ
v
No comments:
Post a Comment