‘మగాళ్లకు తెలిసింది పిల్లల్ని కనడం ఒక్కటే కదా’ అని అంటున్నారు బాలీవుడ్ నటి తాప్సి. ఇది చదవగానే ఆమెను తిట్టుకోకండి. కావాలని అనలేదు. ఆమె నటించిన ‘సాండ్ కీ ఆంఖ్’ అనే సినిమాలోని డైలాగ్ అది. తాప్సి, భూమి పెడ్నేకర్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని ‘ఉమనియా’ అనే పాటను తాజాగా విడుదల చేశారు. ప్రభుత్వం కుటుంబ నియంత్రణ రూల్ను అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో సాగే పాట ఇది. ఈ పాట మొదలవడానికి ముందు తాప్సి హుక్కా తాగుతూ.. ‘ఈ మగాళ్లకు పిల్లల్ని కనడం మాత్రమే వచ్చు. ప్రభుత్వం దానిని కూడా రద్దు చేస్తే ఎలా?’ అని భూమిని అడుగుతంది. ఇందుకు భూమి స్పందిస్తూ.. ‘నేనైతే జీవితాంతం మగాళ్ల జీవితం కుటుంబ నియంత్రణపైనే ఆధారపడి ఉండాలి. అప్పుడైనా మనం మన జీవితాలను ప్రశాంతంగా బతుకుతాం’ అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెడతారు. ఉత్తర్ప్రదేశ్లోని జోహ్రి అనే గ్రామానికి చెందిన చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉండేవారు. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడంతో కుటుంబం కోసమే తమ జీవితాన్ని వెచ్చించారు. తమలా తమ కుమార్తెల జీవితాలు కాకూడదని భావించి 50 ఏళ్ల వయసులో తుపాకీ చేతపడతారు. వారి చదువులను అడ్డుకోవాలని చూసేవాళ్లని తుపాకీలతో బెదిరించేవారు. ఈ నేపథ్యంలో తుపాకీతో టార్గెట్ మిస్సవకుండా దేన్నైనా కొట్టగలిగే సామర్ధ్యం తమలో ఉందని వారికి తెలుస్తుంది. అలా వారు జాతీయ స్థాయిలో జరిగిన రైఫిల్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇద్దరూ దాదాపు 300లకు పైగా పతకాలు సాధించారు. వారి జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమే ‘సాండ్ కీ ఆంఖ్’. ఈ మహిళా షూటర్లకు యూపీలో ‘షూటర్ దాదీస్’గా మంచి పేరుంది. ఈ షూటర్ దాదీస్ గురించి తెలుసుకోవడానికి తాప్సి, భూమి వారి స్వస్థలమైన బాగ్పట్ జిల్లాకు కూడా వెళ్లారు. కొన్ని రోజులు వారి ఇంట్లోనే ఉండి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నారు. అవన్నీ సినిమాకు ఉపయోగపడ్డాయని తాప్సి, భూమి తెలిపారు. సినిమా చిత్రీకరణ మొత్తం బాగ్పట్లోనే జరిగింది. దీపావళి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను తీయడానికి దర్శకుడు తుషార్ ఎందరో నటీమణులను సంప్రదించారు. కానీ 60 ఏళ్ల బామ్మ పాత్రలో నటించడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీపావళి సందర్భంగా ‘సాండ్ కీ ఆంఖ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nSUl52
v
No comments:
Post a Comment