మీటూ, క్యాస్టింగ్ కౌచ్ పేరుతో నటీమణులు, ఫీమేల్ సింగర్స్ ఎన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టినా ఈ ఘటనలకు మాత్రం అడ్డుకట్ట పడటంలేదు. అన్ని ఇండస్ట్రీల్లో లైంగిక వేధింపులు కాస్త తగ్గుముఖం పట్టాయని అన్నారు. కానీ తాజాగా జరిగిన ఘటన గురించి తెలిస్తే మీటూ ఉద్యమం డోస్ పెంచాలని అన్న ఆలోచన కలుగుతోంది. అసలు ఏం జరిగిందంటే.. ప్రముఖ దర్శకుడు ఏ.ఎం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ అనే సినిమాను తెరకెక్కి్స్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ విలన్గా కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో మణిరత్నం అనుష్కను కూడా ఎంపిక చేసుకున్నారట. ఈ విషయంపై అధికారికంగా వివరాలు వెల్లడికాకపోయినా కోలీవుడ్లో ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. కాగా.. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరు గతంలో చిన్మయితో అసభ్యకరంగా ప్రవర్తించాడట. ఈ విషయం ఇటీవల అనుష్కకు తెలీడంతో అలాంటి వ్యక్తులతో కలిసి పనిచేయలేనని తెగేసి చెప్పారట. సినిమా నుంచి తప్పుకున్నారట. అయితే అనుష్కకు చేతి నిండా సినిమాలు ఉండటంతో డేట్లు కుదరక సినిమా నుంచి తప్పుకున్నారని కూడా వార్తలు వస్తు్న్నాయి. ప్రస్తుతం ‘నిశబ్దం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కాకుండా అనుష్క చేతిలో మరో సినిమా లేదు. అలాంటప్పుడు డేట్లు కుదరక సినిమా నుంచి తప్పుకునే అవకాశం లేదు. ఇలాంటి విషయాలపై అనుష్క అస్సలు స్పందించరు. అందుకే ఈ విషయంలోనూ ఆమె మౌనం వహిస్తు్న్నట్లున్నారు. కానీ చిన్మయి మాత్రం ఎప్పటినుంచో మీటూ గురించి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నారు. ఇందుకు ఎందరో నెటిజన్ల నుంచి తిట్లు కూడా తిన్నారు. అయినా చిన్మయి వెనక్కు తగ్గలేదు. ప్రముఖ తమిళ లిరిసిస్ట్ వైరాముత్తు తనతో గతంతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చిన్మయి ఆరోపించారు. అతనిపై పోలీసు కేసు పెట్టినా ఫలితం లేకుండా పోయింది. తనకు న్యాయం జరగాలని దాదాపు ఏడాదిగా చిన్మయి ప్రయత్నిస్తూనే ఉన్నారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన నిర్మాతతో కలిసి పనిచేయనని అనుష్క తప్పుకున్నట్లు తెలిస్తే చిన్మయి తప్పకుండా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. కానీ ఆమె కూడా ఈ విషయం గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు. బహుశా.. ఈ మ్యాటర్ ఇంకా తన దాకా చేరినట్లు లేదు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2pAkMgd
v
No comments:
Post a Comment