Wednesday, 25 September 2019

ముందురావడానికి నో అంటున్న బన్నీ, మహేష్.. దోబూచులాట

సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబు, ఇద్దరికీ కూడా సెంటిమెంట్స్ ఎక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. తన సినిమాకి మూడక్షరాల టైటిల్ ఉండేలా చూసుకుంటాడు. బన్నీ ఏదైనా సినిమా ఓకే చెయ్యాలంటే తనకు అచొచ్చిన ప్లాస్టిక్ చైర్ ఒకటి ఉంటుంది. ఆ సినిమాలో కూర్చునే సినిమా ఓకే చేస్తాడు. ఆ కుర్చీలో కూర్చుని సినిమా ఓకే చేస్తే అది హిట్ అవుతుంది అని నమ్మకం. ఇవి మనకి చూడడానికి సింపుల్‌గానో, సిల్లీగానో అనిపించొచ్చు. కానీ కోట్లరూపాయల పెట్టుబడితో చేసే వ్యాపారం కాబట్టి ఆ సెంటిమెంట్స్‌ని గౌరవించాల్సిందే. Also Read: ఇప్పుడు కూడా అలాంటి ఒక సెంటిమెంట్‌తో తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో కలవరపడుతున్నారు టాలీవుడ్‌లో ఇద్దరు బడా హీరోలు. ఒక పక్క మహర్షి హిట్‌తో ఊపుమీదున్న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులముందుకు రాబోతున్నారు. అలాగే నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా సినిమాతో ప్లాప్ అందుకున్న అల్లు అర్జున్ కూడా ఎలాగయినా హిట్ కొట్టాలని త్రివిక్రమ్‌తో కలిసి అల..వైకుంఠపురములో సినిమా చేసాడు. అయితే ఆ సినిమాని జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆదివారం రిలీజ్ ఏంటి అనుకున్నారు అంతా.కానీ దాని వెనుక చాలా పెద్ద సెంటిమెంట్ ఉంది. Also Read: సంక్రాంతికి రెండు మూడు సినిమాలు బరిలో ఉండడం మామూలే. అయితే వాటిలో ఏ సినిమా అయితే ముందుగా రిలీజ్ అవుతుందో ఆ సినిమా డిజాస్టర్ అయిపోతుంది. గతంలో మహేష్ బాబు సినిమా 1 నేనొక్కడినే, పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, ఎన్టీఆర్ కథానాయకుడు..ఇలా కళ్ళముందే మూడు సినిమాల రిజల్ట్ కనిపిస్తుంటే ఆ సెంటిమెంట్ నమ్మకుండా ఉండడం కష్టమే. జాగ్రత్త పడడం కామనే. పైగా వీటిలో మహేష్ బాబు సినిమా , త్రివిక్రమ్ సినిమాలు కూడా ఉన్నాయి. వాళ్ళు ఆల్రెడీ ఆ సెంటిమెంట్ బారినపడి బావురుమన్నారు. అందుకే ఎవరికి వాళ్ళు వెనక్కు వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు తప్ప ముందు రావడానికి ధైర్యం చెయ్యట్లేదు. Also Read: తమ సినిమా జనవరి 12న ఆదివారం రిలీజ్ చేస్తే మహేష్ జనవరి 10న శుక్రవారం డేట్ తీసుకుంటారు అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం ఆ డేట్‌కి ససేమీరా అంటున్నాడట. ఎందుకంటే 1 సినిమా కూడా ఆ రోజే రిలీజ్ అయ్యింది. అందుకే సెంటిమెంట్‌గా ఆ డేట్‌కి నో అంటున్నాడు. అయితే గత సంక్రాంతికి అదే డేట్‌లో పేట సినిమాతో వచ్చి మంచి కలెక్షన్స్ కొల్లగొట్టిన రజినీకాంత్ ఈ సారి కూడా అదే డేట్‌కి మురుగదాస్ దర్బార్‌తో వస్తున్నాడు. పోనీ ఆ విధంగా ముందువచ్చే సినిమా అది అవుతుంది అనుకున్నా కూడా మహేష్ మాత్రం 14 డేట్ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఒక‌వేళ సరిలేరు నీకెవ్వరు సినిమా 14కి రిలీజ్ అయితే మాత్రం అల..వైకుంఠపురములో సినిమాని ముందు అనుకున్నటు 12కే రిలీజ్ చేస్తారా అనే డౌట్ కూడా లేకపోలేదు. ఎంత వాళ్ళ సెంటిమెంట్‌ని గౌరవించినా కూడా ఒక్క మాట మాత్రం నిజం...సెంటిమెంట్ అంటూ వెనక్కి వెళుతూ అద్బుతమయిన పండగ సీజన్‌ని వేస్ట్ చేసుకుంటున్నారు. అసలే ఈ మధ్య స్టార్స్ నుండి సరయిన సినిమా లేక ప్రేక్షకులు ఆవురావురుమంటూ ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో సరయిన కంటెంట్ ఉన్న సినిమా ముందు రిలీజ్ చేయుకుంటే టికెట్ కౌంటర్ దగ్గర వసూళ్ల వరద పారుతుంది. కాదు.. కాదు.. అని వెనక్కి వెళ్లడం వల్ల సినిమా హిట్ అయినా కూడా పోటీవల్ల కలెక్షన్స్ పంచుకోవాల్సిందే. మరి ఈ విషయంలో అల..వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల టీమ్స్ ఫైనల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2mKjiyj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...