రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ ప్రభావం సినిమా ఓపెనింగ్స్ మీద పడలేదు. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.340 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే, నాలుగో రోజు నుంచి ‘ఆదిపురుష్’ కలెక్షన్ భారీగా పడిపోయింది. దీనికి కారణం టికెట్ ధరలు అధికంగా ఉండడం, సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్. కేవలం ఈ సినిమాను 3డీలో చూడాలని ఆసక్తిచూపిస్తున్న వారు మాత్రమే థియేటర్లకు వెళ్తున్నారు. దీంతో మొదటి మూడు రోజుల్లో రూ.340 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఆ తరవాత ఏడు రోజుల్లో మరో రూ.110 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/NpX3t4M
v
No comments:
Post a Comment