Monday 7 March 2022

మహేష్ బాబు- రాజమౌళి కాంబో.. బాలీవుడ్ బ్యూటీని ఫైనల్ చేసిన జక్కన్న!

సూపర్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో తదుపరి సినిమాపై కసరత్తులు షురూ అయ్యాయట. దర్శకధీరుడు దర్శకత్వంలో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ రూపుదిద్దుకోనుంది. భారీ సినిమా RRR తర్వాత రాజమౌళి పట్టాలెక్కించే ప్రాజెక్ట్‌ ఇదే. RRR పనులు కూడా పూర్తయి విడుదలకు సిద్ధం కావడంతో మహేష్‌తో చేయబోతున్న సినిమా స్క్రిప్ట్ వర్క్స్ చూసుకుంటున్నారట రాజమౌళి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్రేజీ కాంబో గురించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ బయటకొచ్చింది. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ కావడమే కాకుండా తనదైన స్టైల్‌లో వివిధ భాషల్లో ఈ సినిమా రూపొందించాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. ఇందులో నటించబోయే హీరోయిన్ విషయమై ఫైనల్ డిసీజన్ తీసుకున్నారని తెలుస్తోంది. RRR సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌నే ఈ సినిమాలోనూ తీసుకోవాలని ఆయన డిసైడ్ అయ్యారట. RRR షూటింగ్ చేస్తుండగా పని పట్ల ఆమె అంకితభావం రాజమౌళికి బాగా నచ్చిన కారణంగానే మరోసారి ఆమెకు అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయమై త్వరలోనే ఆమెతో చర్చలు జరపనున్నారట జక్కన్న. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం ఈ కథను సానబెట్టే పనిలో ఉన్నారట. సాధారణంగా బలమైన స్క్రిప్స్ రెడీ చేయడంలో దిట్ట అయిన విజయేంద్ర ప్రసాద్‌.. ఈసారి మహేష్‌ కోసం ఎవరూ ఊహించని స్క్రిప్ట్ సిద్ధం చేశారని, ఇది మహేష్ కెరీర్ లోనే భారీ హిట్‌గా నిలిచిపోయేలా రూపొందించాలని జక్కన్న స్కెచ్చేస్తున్నట్లు సమాచారం. అడవి నేపథ్యంలో ఇప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమ చూడని ఫారెస్ట్‌ యాక్షన్‌ ఎడ్వెంచర్‌‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. సో.. వీటన్నింటిపై చిత్రయూనిట్ అధికారిక సమాచారం ఎప్పుడిస్తుందనేది చూడాలి మరి!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/6fHDlEz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...