Tuesday 1 March 2022

భీమ్లా నాయక్ విషయంలో బాగా హర్ట్ అయిన నిత్యామీనన్! కారణమిదే..

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ థియేటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అన్ని సెంటర్లలో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ అభిమానులకు కావాల్సినంత ట్రీట్ దొరికిందని అంటున్నారు. వెండితెరపై పవన్ కళ్యాణ్‌ని చూపించిన విధానానికి జేజేలు కొడుతున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక పవన్ భార్యగా నటన సినిమాలో మేజర్ అట్రాక్షన్ అయింది. అయితే అంతకుముందు జరిగిన 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిత్యామీనన్ కనిపించకపోవడం కాస్త వెలితిగా అనిపించింది. తాజాగా ఇందుకు కారణం ఒక్కటే అని, భీమ్లా నాయక్ సాంగ్ విషయంలో నిత్య హర్ట్ అయిందనే టాక్ నడుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి 'అంత ఇష్టం ఏందయ్యా' అనే సాంగ్ రిలీజ్ చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. చిత్ర పాడిన ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. విడుదలకు ముందే ఈ పాటకు సూపర్ క్రేజ్ దక్కడంతో వెండితెరపై చూడాలని అంతా భావించారు. కానీ సినిమాలో ఈ పాట కథకు అడ్డు తగులుతుందని లేపేశారట. ఇది పవన్‌పై ప్రేమతో నిత్యామీనన్ వైపు నుంచి వచ్చే పాట. అయితే తనకి మంచి క్రేజ్ తెచ్చిపెడుతుందనుకున్న ఈ పాటను కట్ చేయడం నిత్యామీనన్‌కి నచ్చలేదట. దీనిపై చాలా ఫీలైందట కూడా. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఆమె దూరంగా ఉందని తెలుస్తోంది. నిత్యా మీనన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా ఏళ్ళు అయినా కూడా తన నటన, ప్రతిభతోనే కెరీర్‌లో ముందుకు సాగిస్తోంది. ఏ మాత్రం అందాల ఆరబోతకు ఛాన్స్ ఇవ్వకుండానే ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. పాత్ర పరిధిని లెక్కలోకి తీసుకొని సినిమాలు చేస్తూ వస్తోంది. ఇదే బాటలో భీమ్లా నాయక్ భార్య పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో నిత్య రోల్, ఆమె డైలాగ్స్ ప్రేక్షకుల బాగా కనెక్ట్ అయ్యాయి. సో.. ఎలాగోలా ఆ పాట కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేదనేది ప్రేక్షకుల ఫీలింగ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/KJHdqD7
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...