Wednesday, 9 February 2022

ఈరోజుతో శుభం కార్డు ప‌డుతుంద‌ని భావిస్తున్నా : చిరంజీవి

కొన్ని నెల‌లుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొన‌సాగుతోన్న‌ సినిమా టికెట్ రేట్స్ త‌గ్గింపు అనే విష‌యంపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌తో మాట్లాడ‌టానికి టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖులు వెళుతున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రిని 13 మంది సినీ ప్ర‌ముఖులు కలుస్తున్నారు. వారిలో , ప్ర‌భాస్‌, మ‌హేష్‌, రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, పీటీ గిరిధ‌ర్‌, బాబి, నిరంజన్‌, పోసాని కృష్ణ ముర‌ళి, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు ఇప్ప‌టికే బేగం పేట ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. లిస్టులో ఎన్టీఆర్ పేరు ఉంది. ఆయ‌న ఇంకా ఎయిర్ పోర్టుకి చేరుకోలేదు. మ‌రి తార‌క్ వ‌స్తారో రారో లేదో తెలియ‌డం లేదు. ఎయిర్ పోర్టులో చిరంజీవి మాట్లాడుతూ సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి ఇన్విటేష‌న్ వ‌చ్చింద‌ని, త‌న‌తో పాటు ఎవ‌రు వ‌స్తున్నార‌నేది తెలియ‌డం లేద‌ని మీడియాలోనే చూసి తెలుసుకుంటున్నాన‌ని చిరంజీవి తెలిపారు. అలాగే ఈరోజుతో సినిమా ఇండ‌స్ట్రీలోని ప‌లు స‌మ‌స్య‌ల‌కు శుభం కార్డు ప‌డుతుంద‌ని భావిస్తున్న‌ట్లు చిరంజీవి పేర్కొన్నారు. ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని.. వై.ఎస్‌.జ‌గ‌న్‌తో మీటింగ్‌కు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేశారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో గన్నరం ఎయిర్ పోర్టుకి చేరుకుని అక్క‌డ నుంచి తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి చేరుకోబోతున్నారు. సినిమా టికెట్ ధ‌ర‌ల‌తో పాటు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ఇత‌ర స‌మ‌స్య‌లు గురించి కూడా సినీ ప్ర‌ముఖులు సీంతో మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. గ‌త ఏడాదిన ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను బాగా తగ్గించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సినీ ప‌రిశ్ర‌మ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. ప‌లు సంద‌ర్భాల్లో కొంద‌రు ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా చేశారు. అయితే కొంద‌రు మాత్రం చ‌ర్చ‌ల రూపంలో స‌మ‌స్య‌కు ప‌రిష్కారం తీసుకు రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nShpaB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...