Saturday, 5 February 2022

లతా మంగేష్కర్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం.. ఎమోషనల్ పోస్ట్

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ (92) కొద్ది సేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు (ఫిబ్రవరి 6) ఉదయం 8 గంటల 12 నిమిషాలకు లతా మంగేష్కర్‌ తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. భారతరత్న, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్‌ ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్నో వేల పాటలు పాడి సంగీత ప్రియులను మంత్రముగ్దులను చేసిన లతా స్వరం మూగబోయిందని తెలిసి ఆమె అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. లతా మంగేష్కర్‌ మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లతా తుది శ్వాస విడిచారని తెలిసిన కొన్ని నిమిషాల్లోనే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. ''ఎన్నో రకాల ఎమోషన్స్‌తో దీదీ పాటలు అలరించాయి. కొన్ని దశాబ్దాల కాలంగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సేవలందిస్తూ ఎప్పటికప్పుడు వచ్చిన మార్పులను చూశారు లతా. భారతదేశ అభివృద్ధి, ఎదుగుదలపై ఎప్పుడూ మక్కువ చూపేవారు. ప్రపంచంలో భారతదేశ కీర్తి పతాకం ఎగరాలని, దేశం అభివృద్ధి చాలా స్ట్రాంగ్‌గా జరగాలని కోరుకునేవారు. నాపై దీదీ చూపించిన అపారమైన ప్రేమను గౌరవంగా భావిస్తున్నాను. లతా దీదీ ఇకలేరని తెలియగానే నా తోటి భారతీయులతో పాటు నేను ఎంతో బాధపడ్డాను. ఓం శాంతి'' అంటూ ట్వీట్ పెట్టారు మోదీ. 1942లో గాయనిగా కెరీర్ ఆరంభించిన , తన కెరీర్‌లో 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. 25 వేలకు పైగా సోలో పాటలు పాడి గిన్నీస్ రికార్డులో పేరు లిఖించుకున్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3Ukyd1G
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...