Saturday, 5 February 2022

గర్వంగా ఉందన్న తండ్రి.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న హీరో!

‘అరణ్య’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన కోలీవుడ్ నటుడు హీరోగా రూపొందుతున్న‌ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘’. మను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన‌ ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఇప్ప‌టికే నేచురల్ స్టార్ నానితో ట్రైలర్‌ను రిలీజ్ చేయించిన చిత్ర యూనిట్ తాజాగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ తండ్రి, పోలీస్ అధికారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషంగా ఉందని, తన కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పారు. ‘‘నా కుమారుడి వల్లే నేను ఈ రోజు ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయికి రావడానికి కారణమైన అందరికీ కృతజ్ఞతలు. మా వాడి సినీ జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా సాయం చేశారు. అలాగే అభిమానుల గురించి ముఖ్యంగా చెప్పాలి. వాళ్ల వల్లే నా కొడుకు ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు. అభిమానుల ప్రేమ, ఆదరణ నా కొడుకుపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ ఎఫ్ఐఆర్ సినిమాను నేను చూశాను. నాకు బాగా నచ్చింది. మీ అందరికీ కూడా నచ్చుతుంది. అందరూ తప్పకుండా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.’’ అని రమేష్ ప్రసంగించారు. తన తండ్రి మాట్లాడిన మాటలకు విష్ణు విశాల్ ఒక్కసారిగా భావోద్వేగం వ్యక్తం చేశారు. సంతోషంతో ఆనందభాష్పాలు పెట్టుకున్నారు విష్ణు విశాల్. ఇక ఎఫ్ఐఆర్ సినిమా కథాంశం గురించి చెప్పుకుంటే.. అబూ బక్కర్ అబ్దుల్లా అనే భ‌యంక‌ర‌మైన టెర్ర‌రిస్ట్ కార‌ణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి అనూహ్య సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌నేది చిత్ర క‌థ‌గా ట్రైలర్‌లో చూపించారు. ఇర్ఫాన్ అహ్మద్ పాత్ర‌లో విష్ణు విశాల్ న‌టించారు. హీరో విష్ణు విశాల్, హీరోయిన్ రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇక తీవ్రవాదుల‌ని నిర్మూలించే ఆఫీస‌ర్ పాత్ర‌లో స్టార్ డైరెక్ట‌ర్‌ గౌతమ్ వాసుదేవ్ మీనన్ న‌ట‌న ప్ర‌త్యేకంగా కనబడుతోంది. మంజిమా మోహన్ స్క్రీన్ ప్ర‌జెన్స్ ప్ల‌జంట్‌గా ఉంది. అరుల్ విన్సెంట్ కెమెరా ప‌నిత‌నం, అశ్వంత్ సంగీతం ఈ సినిమాకు మేజ‌ర్ హైలెట్స్ కాబోతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/E3nwxmF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...