Saturday, 4 December 2021

దూసుకుపోతోన్న అఖండ.. థియేటర్లో అఘోరాల రచ్చ

నటసింహా , మాస్ డైరెక్టర్ బోయపాటి అంటే సినిమా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ కాంబోగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి సినిమాతో వచ్చారు. బ్లాక్ బస్టర్ కొట్టేశారు. రెండు రోజుల్లోనే నలభై కోట్ల గ్రాస్ దాదాపు 20 కోట్ల షేర్ కొల్లగొట్టారంటే అది మామూలు విషయం కాదు. కరోనా ఇంతలా భయపెడుతున్నా, ఏపీలో టికెట్లు, థియేటర్ల సమస్యలున్నా కూడా అఖండ విజయానికి ఏదీ అడ్డుగోడగా నిలవలేదు. బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ‘అఖండ’ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ వసూళ్లు సాధిస్తోంది. కరోనా వైరస్ భయం, వరుస లాక్‌డౌన్‌లతో సినిమా థియేటర్లలో సందడి కరువయ్యింది. వైరస్ ప్రభావం తగ్గి థియేటర్లు ఓపెన్ అయినా అంత హంగామా ఏమీ కనిపించలేదు. కానీ, ‘అఖండ’ ఆగమనంతో మొత్తం మారిపోయింది. థియేటర్లకు మళ్లీ పాత రోజులొచ్చాయి అనే భరోసాని ‘అఖండ’ కల్పించింది. టాలీవుడ్‌లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. జై బాలయ్య నినాదంతో ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోని థియేటర్లు కూడా మారుమోగుతున్నాయి. ఇదిలా ఉంటే, ‘అఖండ’లో బాలకృష్ణ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలిచింది. అయితే, ఈ రీల్ అఘోరాను చూడటానికి రియల్ అఘోరాలు ‘అఖండ’ సినిమాకు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్‌లో ‘అఖండ’ ప్రదర్శితమవుతోంది. శనివారం సాయంత్రం ఫస్ట్ షో చూడటానికి ఇద్దరు అఘోరాలు థియేటర్‌కు వచ్చారు. వారిని చూసి బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘అఖండ’ సినిమాతో బాలయ్యకు అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారంటూ నందమూరి ఫ్యాన్స్ జై బాలయ్య నినాదాలు చేశారు. బాలయ్య అభిమానులతో కాసేపు మాట్లాడిన అఘోరాలు.. ఆ తరవాత థియేటర్‌లోకి వెళ్లి సినిమాను ఆస్వాదించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3EoSHKr
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...