మాస్ మహారాజా రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ను మొదలు పెట్టి తర్వాత చిన్న నటుడిగా మారి.. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న పాత్రల్లో నటించి తర్వాత హీరోగా మారారు. మంచి విజయాలను సాధించడంతో హీరోగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నారు. తనకంటూ ఓ ఫ్యాన్స్ బేస్ను క్రియేట్ చేసుకున్నారు రవితేజ. ఆయన గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఆయన ప్రాక్టికల్ పర్సన్ అని అంటుంటారు. చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కు సూటిగా చెప్పేయడం ఆయన స్పెషాలిటీ. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలనే దానిపై రవితేజ చెప్పిన సమాధానం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ప్రదీప్ మాచిరాజుకి రవితేజ ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ ‘‘నేను సలహాలు ఎవరికీ ఇవ్వను. ఎందుకంటే సలహాలు ఎవ్వడూ వినడు. సలహాలు ఇచ్చేవాడు.. వినేవాడి ఇన్నర్ వాయిస్ వింటే చస్తాడు. లోపల ఇంకా.. తర్వాత అనుకుంటూ బయట మాత్రం అలాగే అని వినేవాడు నటిస్తుంటాడు. కాబట్టి సలహా ఇవ్వొద్దు, సలహా తీసుకోవద్దు. ఎవడూ మారిపోడు. ఏదైనా మారుతుంది తప్ప, మనిషి స్వభావం ఎప్పటికీ మారదు. పరిస్థితులను బట్టి కాసేపు నటిస్తుంటాడంతే, ఎవరికీ వారుగా నేర్చుకోవాల్సిందే. ఎవరినీ ఏ విషయంలోనూ నిందించవద్దు’’ అని అన్నారు. ఇప్పుడు నెట్టింట రవితేజ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రవితేజ ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో సందడి చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రవితేజ, ఖిలాడి చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారు. మరో వైపు సుధీర్ వర్మతో రావణాసుర అనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్నారు. ఇది కాకుండా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్లోనూ రవితేజ నటించబోతున్నారు. రావణాసుర సినిమాతో రవితేజ చిత్ర నిర్మాణ రంగంలోనూ భాగమవుతున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30wAQCx
v
No comments:
Post a Comment