Monday, 8 November 2021

Padma Awards 2020 : కరణ్ జోహర్, ఏక్తా కపూర్, కంగనా ఎమోషనల్

భారత ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులను ఎంతో గౌరవంగా చూస్తారు. పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అంటూ వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తుంటుంది. సత్కరిస్తుంటుంది. అలా ప్రతీ ఏటా పద్మ అవార్డుల ప్రధానోత్సవం జరగుతుంటుంది. కరోనా కారణంగా ఈ సారి కాస్త ఆలస్యమైంది. అయితే ఈ సారి మాత్రం తెలుగు చిత్ర సీమ నుంచి ఎవ్వరికీ పద్మ అవార్డులు లభించలేదు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు లభించినా కూడా అది తమిళనాడు నుంచి వచ్చింది. నేడు పద్మ పురస్కార కార్యక్రమం జరిగింది. ఇందులో బాలీవుడ్ నుంచి , , వంటి వారికి పద్మ శ్రీ లభించింది. పద్మ శ్రీతో కేంద్ర ప్రభుత్వం వారిని సత్కరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్‌లోనే నేడు పద్మ అవార్డులను స్వీకరించారు. అనంతరం కరణ్ జోహర్, ఏక్తా కపూర్, కంగనా రనౌత్‌లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి పురస్కారం లభించడం ఎంతో గర్వకారణంగా ఉందంటూ కరణ్ జోహర్ పేర్కొన్నాడు. అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషించాడు. ఇక మరో వైపు కంగనా రనౌత్ తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. ఇక్కడి వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్దానని ఈ ప్రయాణంలో ఎంతో మంది శత్రువులు తయారయ్యారని చెప్పుకొచ్చింది. మరో ఏక్తా కపూర్.. దేశంలో నాల్గో అత్యున్నత పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉందని ఎమోషనల్ అయింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BXDY6S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...