Thursday, 18 November 2021

NTR,ANR తర్వాత ఇండస్ట్రీకి మూడో కన్ను చిరంజీవేనన్న వెంక‌య్య నాయుడు.. చిరు వ్య‌తిరేక వ‌ర్గం ఇప్పుడేమంటుందో!

ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌కి సంబంధించి చాలా మందిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.. దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కుగా నిల‌బ‌డేదెవ‌రు? దీనిపై భిన్న స్వ‌రాలు వినిపించాయి. క‌రోనా స‌మ‌యంలో సీసీసీని స్థాపించి సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌ట‌మే కాకుండా.. వీలున్న ప్ర‌తిసారి నేనున్నానంటూ మెగాస్టార్ సినీ ప‌రిశ్ర‌మ‌కు త‌న వంతు సాయాన్ని అందించ‌డానికి ముందుకు వ‌చ్చారు. దీంతో దాస‌రి త‌ర్వాత ఆ స్థానం చిరంజీవిదే అని అని అన్నారు. అనుకున్నారు. ముర‌ళీ మోహ‌న్‌, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వంటి సీనియ‌ర్స్ అయితే దాస‌రి నారాయ‌ణ‌రావు త‌ర్వాత స్థానం చిరంజీవిదే అనే ఓపెన్‌గానే ప‌లు సంద‌ర్భాల్లో చెప్పేశారు. కానీ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల స‌మ‌యంలో మాత్రం చిరుకి వ్య‌తిరేక గ‌ళం బ‌లంగానే వినిపించింది. దీనికి చాలా కార‌ణాలే ఉన్నాయి. సీనియ‌ర్ న‌రేశ్ లాంటి న‌టుడు బ‌హిరంగంగా ఎక్క‌డా చెప్ప‌లేదు కానీ.. భ‌విష్య‌త్తులో మోహ‌న్‌బాబుకి మేం స‌మ‌స్య‌లు చెప్పుకుంటాం అనే రీతిలో ఒక‌ట్రెండు చోట్ల మాట్లాడారు. దీంతో చిరుకి పోటీగా ఇండ‌స్ట్రీకి అండ‌గా మోహ‌న్‌బాబు ఉండ‌బోతున్నారా? అనే ప్ర‌శ్న కూడా వచ్చింది. దీనిపై ఇటు మెగా క్యాంప్‌.. అటు మంచు వ‌ర్గం నేరుగా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద దిక్కు ఎవ‌రు అనే ప్ర‌శ్న మిలియ‌న్ డాల‌ర్స్ క్వ‌శ్చ‌న్‌గానే మిగిలిపోయింది. ఈ నేప‌థ్యంలో చిరంజీవి సినీ ఇండ‌స్ట్రీకి మూడో క‌న్ను అంటూ ఓ పెద్దాయ‌న ఓ వేదిక‌పై బ‌హిరంగంగా మాట్లాడ‌టం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇంత‌కీ చిరంజీవిని ఇండ‌స్ట్రీకి మూడో క‌న్ను అంటూ సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా? సాక్షాత్తు మన దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్యనాయుడు. యోధ డ‌యాగ్న‌టిస్టిక్ సెంటర్ ప్రారంభోత్స‌వానికి చీఫ్ గెస్ట్‌గా వెంక‌య్య నాయుడు వ‌చ్చారు. ఆ కార్య‌క్ర‌మంలో చిరంజీవి, త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్, హ‌రీశ్ రావు, అజ‌హ‌రుద్దీన్‌, ద్రోణ‌వ‌ల్లి హారిక‌, పుల్లెల గోపీచంద్ వంటి ప్ర‌ముఖులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుక‌లో వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు ఎన్టీఆర్ మొద‌టి క‌న్ను అయితే అక్కినేని నాగేశ్వ‌ర‌రావుగారు రెండో క‌న్ను అని.. ఆ త‌ర్వాత పది కాలాల పటు గుర్తు పెట్టుకునే నటుడిగా చిరంజీవి ఎదిగారని, ఇప్పటికీ నటిస్తున్నారని, ఈ విషయాన్నినేనెప్పుడో చెప్పానని అన్నారు. వెంక‌య్య‌నాయుడు అలా అన‌గానే చిరంజీవి చిరున‌వ్వుతో ఆయ‌న‌కు దండం పెట్టారు. ఉప రాష్ట్ర‌ప‌తి వంటి పెద్ద వ్య‌క్తే చిరంజీవిని సినీ ఇండ‌స్ట్రీకి మూడో క‌న్ను అని చెప్ప‌డం గొప్ప విష‌య‌మే. దీంతో దాస‌రి త‌ర్వాత ఇండ‌స్ట్రీలో చిరంజీవిదే అనే విష‌యం తేట తెల్ల‌మైంది. ఈ స‌భ‌లోనే వెంక‌య్య‌నాయుడుని రాష్ట్ర‌ప‌తిగా చూడాల‌నుంద‌ని చిరంజీవి వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలో తెలుగువారికి స్వ‌ర్గీయ ఎన్టీఆర్ గుర్తింపును తెస్తే.. త‌ర్వాత తెలుగుదనానికి నిలువెత్తు నిర్వ‌చ‌నంగా, నిద‌ర్శ‌నంగా వెంక‌య్య‌నాయుడు ఉన్నార‌ని, ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కావాల‌ని తెలుగువారు కోరుకుంటుటున్నార‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి తెలిపారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qKXDoH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...