Friday, 26 November 2021

Janani : ఒక్క పాటలో ఎన్నో ఎమోషన్స్.. రక్తం చిందించిన చెర్రీ, తారక్

రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో రాజమౌళి చేయబోతోన్న మ్యాజిక్ పేరు ఆర్ఆర్ఆర్. ఇప్పటికే దోస్తీ, నాటు నాటు అంటూ అందరినీ ఉర్రూతలూగించాడు. కానీ ఇప్పుడు అందరి గుండెలు బరువెక్కేలా చేసేశాడు జక్కన్న. అంటూ దేశ భక్తిని రగిలించేలా.. ఎంతమంది ఈ నేల కోసం రక్తం చిందించారో చూపించాడు. సినిమాలోని ముఖ్య పాత్రలన్నింటిని ఇందులో చూపించేశారు. ప్రతీ ఒక్క ఎమోషన్‌ను కళ్లకు కట్టినట్టు చూపించేశాడు. రాజమౌళి చెప్పినట్టు ఈ పాటలో అంతర్లీనంగా ఉండే ఎమోషన్స్.. సినిమా మొత్తాన్ని చూపిస్తుందని, ఈ పాట కోసం కీరవాణి ఎంతలా కష్టపడ్డాడో అర్థమవుతోంది. కథ ఏంటి? ఏ పాత్ర ఏంటి? అనేది అందరికీ తెలుసు. కానీ సినిమాలో ఎలా ఉంటుంది? ఎలా సాగుతుందనే విషయాలను బయటకు చెప్పకుండా కీరవాణి పాట రాసిన విధానం, పాడిన విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో , నటన మాత్రం పీక్స్, నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంది. ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తున్నారు. రామ్ చరణ్‌కు అలియా భట్ తిలకం పెట్టే సీన్.. అజయ్ దేవగణ్ శ్రియా సంభాషించే సీన్.. నేను పోరాటం. అంటే నువ్ నాలో సగం.. అంటూ అజయ్ దేవగణ్ చెప్పిన డైలాగ్.. ఎన్టీఆర్ కంటతడి, హీరోలిద్దరూ రక్తంలో తడిసి ముద్దవ్వడం ఇవన్నీ చూస్తుంటే గుండెలు బరువెక్కిపోతోన్నట్టు ఉంది. అయితే ఒక్కో పాత్రకు ముగింపు కూడా గుండెలను పిండేసేట్టు కనిపిస్తోంది. దోస్తీ పాటతో అందరిలో ఓ కొత్త వైబ్రేషన్ తీసుకొచ్చారు. నాటు నాటు అందరూ ఊపు ఊపేశారు. కానీ ఈ జననీ పాట మాత్రం అందరినీ ఎమోషనల్‌గా టచ్ చేస్తోంది. ఇక ఈ సినిమాను థియేటర్లో చూస్తే అదో కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది. ఇది మాత్రం పక్కా అన్నట్టుగా రాజమౌళి తన సినిమాను తెలివిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక నుంచి జనవరి 7 వరకు నిత్యం ఏదో ఒక ప్రమోషన్ ఉండేట్టు కనిపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ రానుందని టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3xn2AWd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...