దేశంలో కరోనా సృష్టించిన అలజడి మాటల్లో చెప్పలేం. జన జీవన వ్యవస్థను అతలాకుతలం చేసి చాలా కుటుంబాల్లో విషాదం నింపింది కోవిడ్ మహమ్మారి. కావాల్సిన వాళ్ళు కళ్ళముందే ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం దగ్గరికి కూడా వెళ్లలేకపోయే విషాదకర దుస్థితిని తీసుకొచ్చింది. అశేష మానవ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారికి చాలామంది బలైపోయారు. కొన్ని ఫ్యామిలీస్లో కుటుంబం మొత్తాన్ని కబళించేసిన ఘటనలు కూడా చూశాం. ఇకపోతే కరోనా కారణంగా ఆర్ధిక స్థితిగతులు దెబ్బతిని రోడ్డున పడిన కుటుంబాలైతే వేళల్లో ఉన్నాయి. అనాథలైన బిడ్డలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు, సోదర సోదరీమణుల లోటు.. ఇలా చాలామంది జీవితాలు ఛిద్రమయ్యాయి. సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీల్లో కూడా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. సెలబ్రిటీలను సైతం కరోనా తీవ్రంగా బాధ పెట్టింది. ఎన్నో చేదు జ్ఞాపకాలను మిగిల్చి గుండెనిండా విషాదం నింపేసింది. తాజాగా అలాంటి విషాదాన్ని బయటపెడుతూ కన్నీరు మున్నీరైంది సీనియర్ నటి వరలక్ష్మి. నవంబర్ 6న ప్రసారం కాబోతున్న క్యాష్ షోలోకి గెస్టులుగా సీనియర్ నటీమణులు ఆమని, యమున, దివ్యా వాణి, వచ్చారు. అయితే ఆ వేదికపై తనలో నిండి ఉన్న బాధను వెళ్లగక్కింది నటి వరలక్ష్మి. ఆమె చెప్పిన విషయాలు విని సహా అక్కడున్న వారంతా కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు మరణించారని చెప్పింది వరలక్ష్మి. తన చెల్లి సరస్వతి భర్త కోవిడ్ కారణంగా మరణించాడని, సరస్వతి కూడా చనిపోతుందని అనుకున్నామని కానీ కష్టపడి బతికించుకున్నామని చెబుతూ కంటతడి పెట్టుకుంది. ఆ సమయంలో ఎవరూ కూడా తన చెల్లికి తోడుగా లేరని, తన చెల్లి ఒక్కతే తన భర్త శవాన్ని మోసుకుంటూ వెళ్లిందని చెబుతూ కన్నీరు పెట్టుకుంది వరలక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wsKS3f
v
No comments:
Post a Comment