‘‘ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడుగారు దేశానికి సేవ చేశారు. ఆయన తెలుగు దనానికి నిలువెత్తు నిదర్శనం, నిర్వచనం. ఓ తెలుగువాడిగా నాకే కాదు, అందరికీ ఆయన రాష్ట్రపతి కావాలనే ఉంది. తెలుగువారందరూ గర్వించేలా వెంకయ్యనాయుడగారు అయ్యప్ప స్వామి సాక్షిగా రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. యోధ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహా చిరంజీవి, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస యాదవ్, అజహరుద్దీన్, పుల్లెల గోపీచంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ‘‘నందమూరి తారక రామారావుగారి ద్వారా ప్రపంచంలో తెలుగువారికి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు వెంకయ్యనాయుడుగారు తెలుగు దనానికి నిర్వచనంగా, నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. ఆయన రాష్ట్రపతి కావాలన్నది నా ఒక్కడి కోరికే కాదు, తెలుగువారందరిదీ’’ అన్నారు. అందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు చిరంజీవి. ఈ సందర్భంగా రాజ్కుమార్ ఫ్యామిలీని ఆయన గుర్తుకు చేసుకున్నారు. రాజ్ కుమార్ గుండెపోటుతోనే చనిపోయారని, శివ రాజ్కుమార్ కూడా గుండె పోటుతో చాలా ఇబ్బంది పడ్డారని, రీసెంట్గా పునీత్ హార్ట్ ఎటాక్తో అందరికీ దూరమయ్యారని, చిన్న వయసులో పునీత్ రాజ్కుమార్ దూరం కావడం ఎంతో బాధాకరమైన విషయమని, ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే పునీత్కు అలా జరగడం అందరినీ కలచి వేసిందని, కాబట్టి ఆరోగ్య విషయంలో ఎలా అశ్రద్ధ పనికి రాదని చిరంజీవి అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి చారిట్రబుల్ ట్రస్ట్కు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా పాతిల లక్షల రూపాయల చెక్ను యోధ డయాగ్నస్టిక్ సెంటర్ యాజమాన్యం అందించింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30ESvYH
v
No comments:
Post a Comment