నటించిన లేటెస్ట్ మూవీ ‘జై భీమ్’. సామాజిక అసమానతలపై పోరాటం చేసిన లాయర్ చంద్రు పాత్రలో సూర్య నటించారు. తమిళనాడు కడలూర్లో జరిగిన ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు. ఈ సినిమా థియేటర్స్లో కాకుండా ఓటీటీలోనే డైరెక్ట్గా రిలీజైంది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమా విషయంలో సూర్య విమర్శలను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. కొన్ని రాజకీయ పార్టీలు, సదరు పార్టీలకు చెందిన నేతలు సినిమాలోని సన్నివేశాలను తప్పు పడుతున్నారు. ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. అందులో మతపరమైన చిహ్నం ఉంటుంది. అందులో సూర్య నటించడాన్ని పీఎంకే పార్టీకి చెందిన మైలాడుతురై జిల్లా కార్యదర్శిపన్నీరు సెల్వం తప్పుపట్టారు. హీరో నిర్మాత సూర్యపై, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ను కలిసి లేఖను సమర్పించారు. అంతే కాదు.. వన్నియార్ అనే సామాజిక వర్గాన్ని జై భీమ్ చిత్రంలో సూర్య అవమానించారని, ఆయన క్షమాపణలు చెప్పి నష్ట పరిహారం కింద ఐదు కోట్ల రూపాయలను ఇవ్వాలని వన్నియార్ సంఘ ప్రతినిధులు కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో సూర్య పై దాడి చేసిన వారికి లక్ష రూపాయలను ఇస్తామంటూ పీఎంకే పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి సూర్యకు ఓ లేఖ రాశారు. దానికి సూర్య కూడా స్పందించారు. ఏదో ఒక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. తను సమాజంలో అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తానని కూడా సూర్య పేర్కొన్నారు. మరో వైపు సూర్య అభిమానులు తమ అభిమాన కథానాయకుడికి మద్దతుని తెలియజేశారు. సోషల్ మీడియాలో#We Stand With Surya ద్వారా సపోర్ట్ చేస్తున్నారు. కేవలం సూర్య అభిమానులే కాదు విజయ్, ప్రభాస్ ఇలా అందరి హీరోల అభిమానులు సూర్యకు అండగా నిలబడి హ్యాష్ ట్యాగ్ను వైరల్ చేస్తున్నారు. జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య తన సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్లో జై భీమ్ సినిమాను భార్య జ్యోతికతో నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఆయన గిరిజన విద్య కోసం ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి కోటి రూపాయలను విరాళంగా అందించడం విశేషం.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qAJH0F
v
No comments:
Post a Comment