Monday, 8 November 2021

విడాకుల తరువాత మగాళ్లకు బాధ ఉండదా?.. సమంత ఇష్యూపై పూనమ్ పరోక్ష కామెంట్లు!

విడాకులు జరిగినప్పుడు ఎక్కువగా మహిళలపై ఆరోపణలు వస్తుంటాయి. మహిళల గురించే ఎక్కువగా మాట్లాడుతుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఈ మధ్య జరిగిన ఘటననే చెప్పుకోవచ్చు. నాగ చైతన్య జోడి విడిపోయింది. విడాకులు తీసుకున్నారు. వేర్వేరుగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమంత గురించే నానా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. దారుణమైన ఆరోపణలు చేశారు. సమంతకు అక్రమ సంబంధాలున్నాయని, డబ్బు కోసమే ఇలా చేసిందని, సినిమా కెరీర్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుందంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఓ ట్వీట్ వేసింది. అది ఎవరిని ఉద్దేశించి చేసింది? ఎందుకు ట్వీట్ వేసింది? అనేది తెలియడం లేదు. కానీ ఆ ట్వీట్‌ను పరిశీలిస్తే.. సమంత విడాకుల వ్యవహారం మీద కామెంట్ చేసినట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఆమె వేసిన ట్వీట్ సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం. విడిపోయిన తరువాత మగవారికి బాధ ఉండదా? వారు బాధపడరా? లేదంటే..ఆడవాళ్లే హింసిస్తారు..ఆడవాళ్లే వారిని మాటలతో చిత్రవధ చేస్తారు..వారి వల్లే మగవారికి సమస్యలు వస్తుంటాయని ఈ సమాజమే పక్షపాత ధోరణిని చూపిస్తోందా?.. ఇప్పటికీ మనం విడాకుల అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటున్నామా? దానిపై మనకు సరైన దృక్పథం ఉందా? అని ప్రశ్నించింది. అయితే పూనమ్ వేసిన ట్వీట్‌కు సంబంధించిన విషయం, ఎవరి గురించి ఆ ట్వీట్ వేసిందన్న సంగతి మాత్రం సరిగ్గా తెలియడం లేదు. ఇక త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా పూనమ్ ఓ ట్వీట్ వేసినట్టు అనిపిస్తోంది. గురు అనే పదానికి అర్థం ఏంటో చెబుతూ ఓ పోస్ట్ వేసింది. అయితే త్రివిక్రమ్ బర్త్ డే కాబట్టి అలా.. సెటైరికల్‌గా ట్వీట్ వేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3CVwH8Z
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...