సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, నటి అయిన ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మంది దిక్సూచిలా మారిపోయింది. ఆమె సలహాలు, సూచనల కోసం ఎంతో మంది అమ్మాయిలు ఎదురుచూస్తుంటారు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని బాధలను కూడా చిన్మయితో చెప్పుకుంటారు. వారి మనసులో ఉన్న బాధలను తీర్చుకుంటారు. చిన్నతనం నుంచి ఎదుర్కొన్న బాధలను, వివక్షను, అత్యాచార ఘటనలను చిన్మయితో పంచుకుంటారు. అయితే తాజాగా ఓ అమ్మాయి తన సమస్యను చిన్మయితో చెప్పుకుంది. తమ తల్లిదండ్రులకు తామిద్దరం ఆడపిల్లలమని, సోదరులు లేరని తెలిపింది.ఈ మధ్యే పెళ్లి పిక్స్ అయిందట. కట్నంగా డబ్బు మాత్రమే కావాలని మగ పెళ్లి వాళ్లు అడుగుతున్నారట. ఆస్తి రాసిస్తాను.. డబ్బు ఇవ్వలేమని చెబితే కుదరదు అంటున్నారట. తాను ఓ రెండేళ్ల పాటు తన తల్లిదండ్రుల కోసం పని చేస్తాను అని, తన శాలరీ అంతా కూడా వారికే ఇచ్చేస్తాను అని చెప్పిందట. కానీ అత్త మాత్రం ఒప్పుకోలేదట. అలా ఎలా చేస్తారు.. నువ్ ఆ డబ్బులు మాకు ఇవ్వాల్సిందే? వారికి ఎలా ఇస్తావ్ అని అంటోందట. అయితే వీటిపై చిన్మయి ఘోరంగా స్పందించింది. ఎవ్వరికీ ఎవరి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరి కష్టార్జితం వారిదేనని తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు చిన్మయి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘మీ నాన్న ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును ఎవ్వరికీ రాసివ్వాల్సిన పని లేదు.. అబ్బాయి వాళ్లు కట్నాన్ని డిమాండ్ చేయకూడదు. నువ్ మీ తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకునే హక్కు నీకుంది. నీ డబ్బును ఎవరికి ఇవ్వాలో నిర్ణయించుకునే హక్కు నీకుంది. మీ అత్తగారి పెత్తనం ఏమీ అవసరం లేదు. ఇలా నీ డబ్బును తింటూ అలా బతకాల్సిన అవసరం వారికి లేదు. ఈ మద్య పెళ్లిళ్లు అంటే.. ఆర్థిక లావాదేవీల్లానే మారిపోయింది. ఎవరో ఒకరు నష్టపోవడం ఇంకొకరు లాభపడటంగా మారింది. మగవారు, వారి కుటుంబం కేవలం ఆడవారి గర్భధారణ కోసం, వారి సంతానాన్ని పెంపొందించడం కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఆడవాళ్లో వారికి అదే అవసరం. అలాంటప్పుడు వారి అబ్బాయికి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు.. అసలు పెళ్లి కోసం ఎవ్వరూ అంత డబ్బును వృథా చేయకండి. ఎవరి కష్టార్జితం వారిది. మీకు డబ్బు కావాలంటే సంపాదించుకోండి’ అని చెప్పుకొచ్చింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3wgTbis
v
No comments:
Post a Comment