మెగాస్టార్ ఈ దీపావళి తమకెంతో ప్రత్యేకమైన పండుగ అని చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన వివరిస్తూ ఓ మెగాభిమానులు కేరింతలు కొట్టే ఫొటోను షేర్ చేశారు. ఇంతకీ చిరంజీవి ఈ దీపావళికి ప్రత్యేకం అని ఎందుకు చెప్పారో తెలుసా.. ఇటీవల యాక్సిడెంట్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయిన మెగా మేనల్లుడు.. సాయిధరమ్ తేజ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని తన మావయ్యలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ ఈ దీపావళికి ఒకచోట చేరారు. ఆ రేర్ పిక్ను చిరంజీవి అందరితో పంచుకున్నారు. ఈ ఫొటోను గమనిస్తే.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, రామ్చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్లతో పాటు పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కూడా ఉన్నారు. అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా వీరిలో సాయిధరమ్ తేజ్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యారు. ‘‘అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికి ఇది నిజమైన పండుగ’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. కొన్ని రోజుల ముందు హైటెక్ సిటీ దగ్గర జరిగిన బైక్ యాక్సిడెంట్లో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. ఓ రకంగా పెద్ద ప్రమాదమే తప్పింది. ఆయన యాక్సిడెంట్ తర్వాత ఆయన హీరోగా నటించిన రిపబ్లిక్ కూడా విడుదలైంది. చాలా రోజుల పాటు సాయిధరమ్ హాస్పిటల్కే పరిమితమయ్యాడు. యాక్సిడెంట్ తర్వాత అసలు ఇప్పటి వరకు సాయిధరమ్ తేజ్ మీడియా ముందుకు రాలేదు. ఎలాంటి ఫొటో కూడా విడుదల చేయలేదు. తొలిసారి ఫ్యామిలీ ఫంక్షన్లో అందరి హీరోలను కలుసుకున్నాడు. దీంతో సాయిధరమ్ తేజ్ ఎలా ఉన్నాడనుకున్న వారికి మరింత క్లారిటీ వచ్చినట్లు అయ్యింది. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. అందరి సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మెగాభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kafzoy
v
No comments:
Post a Comment