ప్రముఖుడు, టాలీవుడ్ ఏస్ రైటర్, సీనియర్ సినీ గేయ రచయిత సిరివెన్నెల తీవ్ర అస్వస్థత కారణంగా కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కిమ్స్లో జాయిన్ అయ్యి రెండు రోజులవుతుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటనేది ఎవరూ చెప్పడం లేదు. ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు కూడా ఈ విషయంపై ఇంత వరకు స్పందించలేదు. 1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ చిత్రంతో గేయ రచయిత సినీ ప్రస్థానాన్ని సీతారామశాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన పాటల రచయితగా వెనుదిరిగి చూసుకోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో వేల పాటలను రాశారు. పాట ఎలాంటిదైనా అందులో తెలియని ఓ స్ఫూర్తిని నింపి రాయడం ఆయన పెన్నుకున్న గొప్ప అలవాటు. అందుకనే తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనెంతో ప్రీతిపాత్రుడయ్యారు. సిరివెన్నెల అద్భుతమైన కలం నుంచి జాలువారిన పాటలకు నందులెన్నో ఆయనింటికి కదలి వచ్చాయి. ఆయన త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cVjy4s
v
No comments:
Post a Comment