దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మరణాంతరం అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఈ విశిష్ట పౌర పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా బాలసుబ్రహ్మణ్యం తరఫున ఆయన కుమారుడు చరణ్ అందుకున్నారు. దేశంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందించే పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగింది. నేడు (మంగళవారం) రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలుకి వచ్చిన పద్మ విభూషణ్ అవార్డును ఆయన తనయుడు స్వీకరించారు. మరో గాయని చిత్ర పద్మ భూషన్ అవార్డు అందుకున్నారు. కంగనా రనౌత్, అద్నాన్ సమీ, కరణ్ జోహార్, ఏక్తా కపూర్ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. మనందరం ముద్దుగా పిలుచునే పేరు . గతేడాది సెప్టెంబర్ 25న ఈ గొంతు మూగబోయింది. బాలుకి చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ ఏర్పడటంతో పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్నారు. పాటపై తనకున్న ఇష్టమే ఆయన్ని సినిమాల వైపు నడిపించింది. అలా సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన.. తన పాటతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థానం ఏర్పర్చుకున్నారు. 1980లో విడుదలైన ‘శంకరాభరణం’ సినిమాతో బాలు ఖ్యాతి ఖండాలు దాటింది. ఈ సినిమాతో ఆయన తొలి జాతీయ అవార్డును అందుకున్నారాయన. సుమారు 16 భాషల్లో కలుపుకుని 40వేలకు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అత్యధిక పాటలు పాడిన మేల్ సింగర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో బాలు స్థానం సంపాదించారు. ఆయన 2001లో పద్మశ్రీ, 2011లో పద్మ భూషణ్ అవార్డులు అందుకొని మరణాంతరం పద్మ విభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3BZfquy
v
No comments:
Post a Comment