పవర్ స్టార్ అంటే ఏ రేంజ్లో ఫైర్ అవుతుందనేది ప్రతి ఒక్కరికీ తెలుసు. ఏ చిన్న అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది ఈ సంచలన తార. గతంలో ఎన్నోసార్లు ఇలా పవన్పై సంచలన కామెంట్స్ చేసి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి లోనైన శ్రీ రెడ్డి.. ఈ సారి మరింత ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏకంగా 'ఒరేయ్ దద్దమ్మ' అంటూ సంబోధించి వార్తల్లో నిలిచింది. బోల్డ్ మాటలతో పిచ్చెక్కించడమే కాదు ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇష్యూలపై కామెంట్స్ చేయడంలో ముందుంటున్న శ్రీ రెడ్డి.. తాజాగా ఏపీ రాజకీయాల విషయమై మరోసారి నోరు విప్పింది. గత కొన్ని రోజులుగా హీటెక్కిన ఏపీ రాజకీయ పరిస్థితులపై అటాక్ చేసింది. టీడీపీ ఆఫీసులపై వైసీపీ నేతల అటాక్ జరిగింది. ఆ తర్వాత కొందరు టీడీపీ నేతలు జగన్ పాలనను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. దీంతో తనకు ఇష్టమైన ఏపీ సీఎం జగన్కి సపోర్ట్ చేస్తూ ప్రత్యర్థులపై శివాలెత్తింది శ్రీ రెడ్డి. అరెస్ట్ అయిన ఏపీ టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని నోటికొచ్చిన బూతులు తిట్టడమే గాక, పవన్ కళ్యాణ్ ఇష్యూ తెరపైకి తెచ్చి సంచలన కామెంట్స్ చేసింది. నా నోరు ఓపెన్ చేస్తే ఎలాంటి బూతులొస్తాయో పవన్ కళ్యాణ్ గాడిని అడుగు చెబుతాడు అంటూ పట్టాభిపై విరుచుకుపడింది శ్రీ రెడ్డి. ''ఈ రోజు పవన్ కళ్యాణ్ గాడు వచ్చి ఆఫీసులపై దాడి చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు అంటున్నాడు. ఒరేజ్ దద్దమ్మ.. నువ్వు మొదలు పెట్టావురా సన్నాసి, దద్దమ్మ అని. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు బూతు రాజకీయాలు మొదలుపెట్టిందే నువ్వు. సినిమా ఆడియో ఫంక్షన్లను కూడా మీ పొలిటికల్ ప్రెస్ మీట్లుగా మార్చుకుంటున్నారు. జగన్ గారిపై బురద జల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి వెళ్లి జగన్ గారిపై నిందలు వేయడమే మీ పని. రౌడీ రాజకీయాలు ఎవరు నడిపిస్తున్నారో తెలియదా?'' అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jLkM6r
v
No comments:
Post a Comment