Friday, 22 October 2021

కుక్కలతో పోల్చిందా?.. షారుఖ్ ఖాన్ వీడియోపై కస్తూరీ శంకర్ సంచలన కామెంట్స్

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఆమె సమాజంలో జరిగే అన్ని విషయాల మీద స్పందిస్తుంటుంది. స్వతాహాగా న్యాయవాది, సోషల్ యాక్టివిస్ట్ అవ్వడంతో ప్రతీ సమస్య మీద స్పందిస్తుంటుంది. అయితే తాజాగా షారుఖ్ ఖాన్, మీడియా అనే అంశం మీద కౌంటర్లు వేసింది. తన కొడుకును బయటకు తీసుకొచ్చేందుకు ఎంతగా పరితపిస్తున్నాడో అందరికీ తెలిసిందే. గత మూడు వారాలుగా తన కొడుకును బెయిల్ మీద తీసుకొచ్చేందుకు నానా తంటాలు పడుతున్నాడు. కానీ ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరిస్తూనే వస్తోంది. ఇక నిన్న మొత్తానికి తన కొడుకు ఆర్యన్ ఖాన్‌ను కలిసేందుకు షారుఖ్ ఖాన్‌కు కోర్టు అనుమతినిచ్చిందీ. దీంతో నిన్న షారుఖ్ జైలు లోపలకి వెళ్లాడు. కొడుకుతో మాట్లాడి బయటకు వచ్చాడు. ఇక అలా ఓ సెలెబ్రిటీ బయటకు వస్తుంటే మీడియా ఎలా వ్యవహరిస్తుందో.. మైకులతో ఎలా చుట్టుముడుతుందో అందరికీ తెలిసిందే. అలా షారుఖ్ జైలు నుంచి బయటకు రావడంతో మీడియా మొత్తం మీద పడింది. ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. దానిపై కస్తూరీ శంకర్ కౌంటర్లు వేసింది. అందుకే వాళ్లను న్యూస్ రిపోర్టర్స్ అని అంటారు.. బైట్ (bi(y)te)కోసం ఏదైనా చేస్తారు అని అనేసింది. బైట్ అంటూ వీడియో, ఆడియో బైట్ అని కాకుండా కరవడం అనే మీనింగ్ కూడా వచ్చేట్టు పరోక్షంగా కౌంటర్లు వేసింది. అంటే మీడియా వాళ్లు కుక్కల్లా ఎగబడ్డారు అని అన్నట్టు కనిపిస్తోంది. అయితే ఆశిష్ మిశ్రా కోసం అజయ్ మిశ్రా వచ్చినప్పుడు ఇలా ఎంతమంది మైకులు పెడతారు? ఎగబడతారు అనేది చూడాలి అంటూ కౌంటర్లు వేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pvHX8f
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...