Thursday, 21 October 2021

ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నా!.. అమ్మను తలుచుకుంటూ ఏడ్చేసిన ఉత్తేజ్ కూతురు

నటుడు సతీమణి గత నెలలో మరణించిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సెప్టెంబర్ 13న ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య మరణంతో ఉత్తేజ్, అమ్మ మరణంలో కూతుళ్లిద్దరూ తల్లిడిల్లిపోయారు. వారిని సినీ ప్రముఖులందరూ ఓదార్చారు. ఇక ఉత్తేజ్, ఆయన చిన్న కూతురు చిరంజీవి ఒళ్లో తలవాల్చి భోరుమని విలపించారు. అమ్మ మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను అంటూ పాట ఉత్తేజ్ ఎమోషనల్ అయింది. పాట ఉత్తేజ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ చూస్తే అమ్మను ఎంతలా మిస్ అవుతుందో తెలుస్తోంది. భోరున ఏడుస్తూ అమ్మ కోసం పరితపిస్తోంది. పాట ఉత్తేజ్ షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. ‘అమ్మా.. ఐ లవ్యూ.. మాతో నువ్ లేవనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను.. నువ్వే మా ప్రాణం.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను. నాన్న కోసం, మా కోసం నువ్ ఎంతగా కష్టపడ్డావో మాకు తెలుసు. ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన మహిళవి నువ్. అమ్మ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నవ్వు మళ్లీ తిరిగి వస్తావనే నమ్మకం నాకుంది. రెండు చేతుల్లో బ్యాగులు పట్టుకుని ఇంట్లోకి వచ్చే దృశ్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి. నువ్ చాలా ధైర్యవంతురాలివి అమ్మ.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అమ్మ.. నీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. నీలాంటి మంచిది ఎక్కడా ఉండదు అమ్మ. నువ్ లేకపోయే సరికి మా జీవితం పూర్తిగా మారిపోయింది అమ్మ. నువ్ లేకపోతే నేను జీరోను అయ్యాను అమ్మ.. కానీ నువ్ కన్న కలలను నెరవేరుస్తాను. లవ్యూ లవ్యూ అమ్మ. నువ్వే మంచి అమ్మవి అంతే’ అని భోరున ఏడుస్తున్న ఎమోజీలను షేర్ చేసింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3B0IukQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...