యూట్యూబ్ చానెల్స్, వాటి థంబ్ నెయిల్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎంతలీ వీక్షకులను తప్పుదారి పట్టిస్తారో రోజూ చూస్తూనే ఉంటాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన చిన్నా చితకా యూట్యూబ్ చానెల్స్లో అయితే ఇలాంటివి కోకోల్లలుగా జరుగుతుంటాయి. కానీ కొన్ని పేరు మోసిన చానెల్స్లోనూ ఒక్కోసారి అలాంటి ఘటనలు జరుగుతుంటాయి. విషయంలో సోషల్ మీడియా, మీడియాలో లెక్కలేనన్ని కారు కూతలు వినిపించాయి. ఇక చివరకు ఎవరో వైద్యుడు చెప్పిన పిచ్చి మాటలను కూడా రాసేశారు. సమంత గర్భం మీద కథనాలు రాసేశారు. అక్రమ సంబంధాలను అంటగట్టేశారు. అలా తన మీద వచ్చిన లెక్కలేనన్ని రూమర్ల మీద సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. తన మీద సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లను ఖండించింది. అయితే తాజాగా సమంత తీసుకున్న ఓ నిర్ణయంతో నెట్టింట్లో చర్చ మొదలైంది. తన మీద తప్పుడు కథనాలు రాసిన మూడు యూట్యూబ్ చానెళ్లలకు సమంత కోర్టు నోటీసులు పంపించింది. తన పరువుకు నష్టం వాటిల్లేలా కథనాలు రాశారంటూ బుధవారం ఆ మూడు చానెల్స్ను కోర్టుకు ఈడ్చింది. అందులో శ్రీనివాస్ చానెల్ కూడా ఉంది. ఆన్లైన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీఎస్ టాక్ షో ఫేమ్ ఈ విషయం మీద స్పందించాడు. సమంత వేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని వేడుకున్నాడు. సోషల్ మీడియాతో ఎంతగానో జీవితం పెనవేసుకున్నారు.. చివరకు విడాకుల విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రకటించారు.. అలాంటప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్ చానెళ్ల మీద కేసులు వేయడం మంచి పద్దతి కాదని అన్నాడు. ప్రతి సామాన్యుడి చేతులో ఉన్న ఆయుధం సోషల్ మీడియా.. ప్రతి ఒక్కటీ సోషల్ మీడియా పై షేర్ చేసుకునే అవకాశం సోషల్ మీడియా కలిపించింది..అలాంటి ఆయుధంపై నోటీసులు ఇవ్వడం మంచిది కాదని అన్నాడు. ఏదైనా అభ్యంతరకంగా ఉంటే దాన్ని తొలగించేందుకు సిద్దంగా ఉన్నామని అన్నాడు. వెంటనే ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని సమంతను వేడుకున్నాడు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30OKxfl
v
No comments:
Post a Comment