Sunday, 3 October 2021

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌కి పితృ వియోగం

బాలీవుడ్‌తో పాటు.. ఇటు తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్. తెలుగులో ఐదు సినిమాల్లో ఆయన నటించి తనదైన శైలీలో ప్రేక్షకులకు వినోదం పంచారు. ఇక రీసెంట్‌గా ఆయన గ్రాండ్ సక్సెస్ అందుకుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌ సిరీస్‌తో. రాజ్ అండ్ డీకే సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్ తొలి భాగం 2019లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఇక రెండో భాగం ఈ ఏడాది జూన్‌లో విడుదల అయింది. ఈ సిరీస్‌లో టాలీవుడ్ నటి సమంత ఓ ప్రధాన పాత్రలో కనిపించింది. అయితే తాజాగా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి ఆర్‌కే బాజ్‌పాయ్ ఆదివారం అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే ప్రస్తుతం కేరళలో షూటింగ్‌లో ఉన్న మనోజ్.. తన తండ్రి మరణ వార్త వినగానే షూటింగ్‌ని మధ్యలోనే వాయిదా వేసుకొని ఢిల్లీకి వెళ్లారు. కొద్దిరోజుల క్రితమే తన తండ్రికి తనకు ఉన్న అనుబంధాన్ని మనోజ్ మీడియాతో పంచుకున్నారు. తాను ఎంతో ఉన్నత చదువులు చదువుకోవాలని తన తండ్రి ఆకాంక్షించేవారు ఆని ఆయన పేర్కొన్నారు. అందుకే ఎంత ఖర్చు అయినా సరై.. 18 సంవత్సరాల వయస్సులోనే తన తండ్రి తనను ఢిల్లీకి పంపించారు అని ఆయన తెలిపారు. తన తండ్రి కోరినట్లుగానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను అని.. అయితే మరోవైపు నటుడు కావాలనే తన కలని సాకారం చేసుకొనేందుకు కష్టపడే వాడిని అని ఆయన తెలిపారు. అయితే ఈ కష్టంలో తన తండ్రి ఎంతో సహాయం చేశారు అని ఆయన అన్నారు. తనకు ఎంతో ఇష్టమైన దిగ్గజ నటుడు ‘మనోజ్ కుమార్’ పేరునే తనకి పెట్టారు అని ఆయన పేర్కొన్నారు. ఇక మనోజ్‌ కుమార్ తండ్రి మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్లు ప్రార్థన చేస్తున్నట్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3ouacne
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...