Sunday, 24 October 2021

డ్రగ్ కేసు ఎఫెక్ట్.. అనన్య పాండేకు షాక్ ఇచ్చిన పాన్ ఇండియా మూవీ నిర్మాత?

బాలీవుడ్ అప్ క‌మింగ్ హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడు అవ‌కాశాల‌ను అందుకుంటూ త‌న‌దైన గుర్తింపు తెచ్చుకుంది . ఈ అమ్మ‌డు కేవ‌లం బాలీవుడ్‌కే ప‌రిమితం కావాల‌నుకోలేదు. అందుక‌నే పూరీ జ‌గ‌న్నాథ్‌, క‌ర‌ణ్ జోహార్ కోసం లైగ‌ర్ అనే పాన్ ఇండియాలో న‌టించ‌డానికి ఒప్పుకుంది. అంతా స‌వ్యంగా జ‌రుగుతుంది. ఇంకేముంది మ‌రిన్ని పాన్ ఇండియా సినిమాలు అన‌న్య కోసం లైన్‌లోకి వ‌స్తాయ‌ని అంద‌రూ అనుకున్నారు. అనుకున్న‌ట్లుగానే మ‌రో పాన్ ఇండియా నిర్మాత‌లు త‌మ సినిమాలో అన‌న్య‌నే హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమెతో సంప్ర‌దింపులు చేస్తున్నారు. అయితే ఈ క్ర‌మంలో ఆమెకు అనుకోని షాక్ త‌గిలింది. క్రూయిజ్ డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంలో అరెస్ట్ అయిన షారూక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్‌ఖాన్‌తో ఛాటింగ్ చేయ‌డం.. అది ఎన్‌సీబీ అధికారుల దృష్టిలో రావ‌డం వ‌ల్ల‌.. ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. ఇంకేముంది.. ప్ర‌స్తుతం అన‌న్య‌పాండేను హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకున్న పాన్ ఇండియా నిర్మాత‌లు వెనక‌డుగు వేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ నిర్మాత ఎవ‌రో కాదు.. దిల్‌రాజు. ఈయ‌న కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్‌తో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో రూపొంద‌నున్న ఈ సినిమాలో అన‌న్య పాండేను హీరోయిన్‌గా అనుకున్నార‌ని, అయితే ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో, ఆమెను సినిమాలోకి తీసుకుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు వ‌స్తాయేమోన‌ని భావించిన‌ట్లు టాక్‌. అయితే ఈ వార్త‌ల‌ను కొంద‌రు కొట్టిప‌డేశారు. అస‌లు అన‌న్య పాండే ఎవ‌రు సంప్ర‌దించ‌లేదంటున్నారు. మ‌రి దీనిపై దిల్‌రాజు, వంశీ పైడిప‌ల్లి ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పుడు ఈ క్రూయిజ్ డ్ర‌గ్స్ కేసు మ‌రింత జ‌ఠిలంగా మారింది. సాక్షి అనుకున్న వ్య‌క్తే..ఎన్‌సీబీ అధికారులు ఆర్య‌న్‌ఖాన్‌ను విడుద‌ల చేయ‌డానికి పాతిక కోట్ల రూపాయ‌లు అడిగారంటూ అఫిడ‌విట్ చేస్తూ మీడియాకు చెప్పాడు. దీంతో పాటు కొన్ని ఫొటోలు, వీడియోలు కూడా వెలువ‌డ్డాయి. దీంతో ఎన్‌సీబీ అధికారులు కేసును మ‌రింత సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఇప్ప‌టికే అన‌న్య పాండేను రెండు సార్లు అధికారులు విచారించారు. ఆమె ఫోన్‌, ల్యాప్ ట్యాప్‌ను సీజ్ చేసి ఆమె తొలిగించిన ఛాటింగ్ వివ‌రాల‌ను రిట్రివ్ చేసే పనిలో ఉన్నారు పోలీసులు. మ‌రి అన‌న్య పాండేకు ఆర్య‌న్ ఖాన్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి సంబంధించిన వివ‌రాలు తెలుసునని, ఆమె మూడుసార్లు అత‌ని డ్రగ్స్‌ను స‌ర‌ఫరా చేసింద‌ని వారు న‌మ్ముతున్నారు. మ‌రి అన‌న్య పాండే విచార‌ణ త‌ర్వాత మరెవ‌రికీ ఎన్‌సీబీ నుంచి పిలుపు వ‌స్తుందోన‌ని టెన్ష‌న్ బాలీవుడ్ వ‌ర్గాల్లో మొద‌లైంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pyPDqh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...