Friday, 8 October 2021

నాగశౌర్య ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. దసరా రేసు నుంచి తప్పుకున్న ‘వరుడు కావలెను’.?

విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు అలరించడంలో హీరో నాగ శైర్య ఎప్పుడూ ముందుంటారు. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఆయన సినిమాలో వినోదం మాత్రం ఫుల్‌గా ఉంటుంది. అయితే గత ఏడాది ఆయన నటించిన ‘అశ్వథ్థామ’ అనే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ‘లక్ష్య’, ‘’ తదితర సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాల టీజర్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘వరుడు కావలెను’ సినిమాను దసరా కానుకగా.. అక్టోబర్ 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఆ నిర్ణయాన్ని చిత్ర యూనిట్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు ‘మహా సముద్రం’ సినిమాను దసరాకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. కానీ, తమది వేరే జానర్ సినిమా కావడంతో ధైర్యంగా విడుదలకు ముందుకు వెళ్లింది చిత్ర యూనిట్. కానీ, రీసెంట్.. అదే టైంలో రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్, శ్రీలీలా హీరోహీరోయిన్లుగా చేస్తున్న ‘పెళ్లి సందD’, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలు కూడా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్లు ప్రకటించాయి. దీంతో ఆ టైంలో తమ సినిమాను విడుదల చేయడం కరెక్ట్ కాదని ‘వరుడు కావలెను’ చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు. అందుకే తమన సినిమా విడుదలని వాయిదా వేసుకున్నట్లు సోషల్‌మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. తమన్ మరియు విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mysy3R
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...