యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘’(రణం రౌద్రం రుధిరం). పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా విడుదల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న చిత్రం కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్పై వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఈ ఏడాది దసరా సందర్భంగా అక్టోబర్ 13న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించినా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా వాయిదా పడుతుందని, వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో సినీ వర్గాల తాజా సమాచారం మేరకు, ట్రిపుల్ ఆర్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. జనవరి 12న ఆర్ఆర్ఆర్ విడుదలయ్యే అవకాశం ఉందని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. అయితే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తే సినీ ఇండస్ట్రీలో కొత్త తలనొప్పి క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు కారణం.. ట్రిపుల్ ఆర్ను దసరాకు విడుదల చేస్తామని చెప్పిన తర్వాతే పవన్కళ్యాణ్ తన భీమ్లా నాయక్ సినిమాను జనవరి 12న.. మహేశ్ తన సర్కారు వారిపాట చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. షూటింగ్స్ ప్లానింగ్ ప్రకారం పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మరోసారి ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ను వాయిదా వేయడమే కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటే.. .పవన్, మహేశ్ తమ సినిమా రిలీజ్ డేట్స్ సందిగ్ధం ఏర్పడినట్లే. ట్రిపుల్ ఆర్ రిలీజ్ డేట్ మారితే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ కావడం పక్కా. మరి పవన్, మహేశ్లిద్దరూ వారి సినిమాలను పోస్ట్ పోన్ చేసుకుంటారా? లేక జక్కన్న అండ్ టీమ్ ఆర్ఆర్ఆర్ విడుదలను వేసవిలోకి తీసుకెళతారా? అనేది తెలియాలంటే ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m5gWoR
v
No comments:
Post a Comment