టైటిల్ సాంగ్ ఎంతలా మార్మోగిపోతోందో అందరికీ తెలిసిందే. ఓ వైపు లిరిక్స్ మీద కొందరు పెదవి విరుస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం కాలర్ ఎగిరేస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ లిరికల్ వీడియోలో ఒక జనాపద కళాకారుడు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించారు. దర్శనం మొగులయ్య అనే ఈ కళాకారుడు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. కిన్నెర మెట్ల స్వరాన్ని పలికించడంతో ఆయన ప్రతిభ కనిపిస్తోంది. తాజాగా ఆయనకు, ఆ జానపద కళారూపానికి గౌరవంగా పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు జనసేన ఓ అధికారిక ప్రకటనను చేసింది. ‘భీమ్లా నాయక్’ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన శ్రీ దర్శనం మొగులయ్యకు రెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కళ్యాణ్లో ఉంది. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. ఆయనకు పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ద్వారా రెండు లక్షలు అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందజేస్తారు అంటూ ఓ ప్రెస్ నోట్ను వదిలారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VdUK2n
v
No comments:
Post a Comment