తమిళ హీరోలో దళపతి విజయ్కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే.. తమిళనాట పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ ఏడాది ‘మాస్టర్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్.. త్వరలో ‘’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేస్తుంది. అయితే తాజాగా విజయ్ ఈ మధ్యకాలంలో ఈ విషయంలో వార్తల్లో నిలిచారు. తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని వాళ్ల తల్లిదండ్రులతో సహా.. 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో కేసు పెట్టారు. కొన్నిరోజుల ముందు విజయ్ తండ్రి, సీనియర్ దర్శకుడు ఎస్.ఎ.చంద్రశేఖర్ ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. ఈ పార్టీకి జనరల్ సెక్రటరీగా ఎస్.ఎ.చంద్రశేఖర్, ట్రెజరర్గా శోభా చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. విజయ్ కూడా రాజకీయాల్లో పాల్గొంటున్నారు అంటూ ఆయన తండ్రి ప్రకటన చేశారు. అయితే, తనకు, తన తండ్రి స్టార్ట్ చేసిన రాజకీయ పార్టీకి ఏ సంబంధం లేదంటూ అప్పట్లో విజయ్ ఓ ప్రకటనను విడుదల చేశారు. తన తండ్రి, ఆయను స్థాపించిన పార్టీ తన పేరుని ఉపయోగించుకున్నట్లు తెలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. అయితే విజయ్ పెట్టిన కేసుతో ఆయన తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ వెనక్కితగ్గారు. తన పార్టీని రద్దు చేస్తున్నట్లు ఆయన చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘బీస్ట్’ చిత్రానికి నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39IqWP5
v
No comments:
Post a Comment