Monday, 27 September 2021

బ్యాక్ టు హోమ్.. ఇంటికొచ్చేశా అంటూ హీరో పోస్ట్! హాస్పిటల్ నుంచి అడవి శేష్ డిశ్చార్జ్

యంగ్ హీరో కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. డెంగ్యూ సోకడంతో ఆయన సెప్టెంబర్ 18న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. డెంగ్యూ కారణంగా ఆయన రక్తంలో ప్లేట్‌లెట్స్‌ ఆకస్మాత్తుగా తగ్గిపోవడంతో అప్పటి నుంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన.. తాజాగా తన ఆరోగ్యం గురించి స్వయంగా అప్‌డేట్ ఇచ్చారు. తాను ఇంటికి తిరిగొచ్చినట్లుగా పేర్కొంటూ ట్వీట్ చేశారు. ''బ్యాక్ టు హోమ్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా'' అని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు అడవి శేష్. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ‘’ సినిమాలో నటిస్తున్నారు. 26/11 ముంబై టెర్రర్ అటాక్‌లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చాలా రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 'గూఢచారి' ఫేమ్ శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'మేజర్' సినిమా నిర్మాణంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భాగం కావడం విశేషం. సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. చిత్రంలో అడవి శేష్ సరసన శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సైయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం టాలీవుడ్ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2XOq7BC
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...