Sunday, 26 September 2021

లైగర్ అప్డేట్.. విజయ్ పూరి మ్యానియా ఇక షురూ

లాంటి హీరోతో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఊహ సిని అభిమానులకు ఉంటుంది. వారి ఊహలు, అంచనాలకు తగ్గట్టుగా ప్యాన్ ఇండియన్ స్థాయిలో అంటూ విజయ్ దేవరకొండతో మ్యాజిక్ చేసేందుకు పూరి రెడీ అయ్యాడు. కరోనా అనేది రాకపోయి ఉంటే ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో మోతమోగిపోయేది. కానీ కరోనా వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ గోవాలో జరుగుతోంది. ఈ సుధీర్ఘ షెడ్యూల్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ మీద యాక్షన్ సీక్వెన్స్‌లు షూట్ చేస్తున్నారు. విదేశీ ఫైటర్లతో విజయ్ దేవరకొండ పోరాట సన్నివేశాలు చేస్తున్నారు. ఈ మధ్యే షూటింగ్ లొకేషన్‌లోకి బాలయ్య ఎంట్రీ ఇచ్చారు. లైగర్ సెట్‌ను చూసి బాలకృష్ణ ముచ్చటపడ్డారట. సెట్ గ్రాండ్ నెస్‌ను చూసి, సినిమాను ఇంత భారీ ఎత్తున నిర్మిస్తుండటంతో మేకర్స్‌ మీద బాలకృష్ణ ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది. ఇక లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ లుక్‌ను చూసి బాలకృష్ణ ఆశ్చర్యపోయాడట. లైగర్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని, ఆ టీంకు బాలకృష్ణ కంగ్రాట్స్ తెలిపాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. స్ట్రైకింగ్ అనౌన్స్మెంట్ అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. రేపు సాయంత్రం 4 గంటలకు టీజర్ రాబోతోన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ అనన్య పాండే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39CBbEz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...