Saturday, 25 September 2021

పండుగకు కలుసుకుందాం అంటున్న శౌర్య.. తన సినిమా విడుదల తేదీని ప్రకటించిన యువహీరో

తెలుగు హీరోలలో ప్రస్తుతం బాగా పాపులారిటీ ఉన్న హీరో ఎవరంటే ముందుగా అందరు హీరో ‘నాగశౌర్య’ పేరు చెబుతారు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ తదితర సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. కొద్ది రోజుల క్రితం ‘అశ్వథ్దామ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ప్రస్తుతం అతను చేస్తున్న సినిమాలు కూడా ఎంతో విలక్షణంగా ఉన్నాయి. అందులో ‘’ సినిమా కూడా ఒకటి. మొన్నటి వరకు వరుడు కావలెను సినిమా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. ‘దిగు దిగు నాగ’ అంటూ వదిలిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా ఐటం పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. రాసిన అనంత్ శ్రీరామ్, కొట్టిన తమన్, కుప్పి గంతులు వేయించిన శేఖర్ మాస్టర్‌ను అందరూ ఏకిపారేశారు. అంత జరుగుతున్నా కూడా చిత్రయూనిట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. అయితే ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్. అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌లో నాగశౌర్య, రితూ వర్మల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అంటూ వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్. ఈసారి దసరా బరిలో తన సినిమా విడుదల అవుతుంది అంటూ అధికారికంగా ప్రకటన చేసింది. అక్టోబర్ 15వ తేదీన సినిమా విడుదల అవుతున్నట్లు ప్రకటించారు. ఇక సినిమా ఇతర వివరాల విషయానికొస్తే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం వంశి పచ్చి పులుసు, సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3i73X4S
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...