Wednesday, 1 September 2021

అదే నన్ను హీరోగా నిలబెట్టింది.. దాన్ని ప్రజలు ఒప్పుకోకుంటే కష్టమయ్యేది: ఆయుష్మాన్

ఈ మధ్యకాలంలో సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువైంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ అసలు కొన్ని సన్నివేశాలు తీయాలంటేనే వెనుకాడిన దర్శకనిర్మాతలు ఇప్పుడు చాలా ఫ్రీగా అటువంటి సన్నివేశాలు చేస్తున్నారు. అలాంటి సన్నివేశాల్లో చేసేందుకు కూడా నటీనటులు వెనుకాడటం లేదు. కొంతమంచి హీరోయిన్లు అయితే.. ఎంతో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నారు. ప్రేక్షకులు కూడా కొన్ని సందర్భాల్లో వీటిని ఆదరిస్తుంటే.. కొన్ని సందర్భాల్లో మాత్రం విమర్శలు చేస్తున్నారు. అయితే నటుడు కూడా ఇలాంటి బోల్డ్ కంటెంట్ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు. ఓ విభిన్నమైన పాత్రతో ఆయన ‘’ అనే సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. జుహీ చెతుర్వేదీ రచించిన ఈ సినిమా స్క్రిప్ట్‌కు సుజీత్ సర్కార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ద్వారా యామీ గౌతమ్ బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయింది. అత్యంత సెన్సిటవ్ కంటెంట్ అయినప్పటికీ.. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అద్భుతంగా ఉండటంతో.. సినిమా మంచి హిట్ అయింది. ఆ తర్వాత ఆయుష్మాన్‌కి కూడా బాలీవుడ్‌లో మంచి క్రేజ్ పెరిగిపోయింది. బదాయి హో, బాలా, శుభ్‌మంగళ్‌ సావధాన్‌ వంటి సినిమాల్లో నటించి ఆయన ప్రేక్షకుల మనస్సు దోచుకున్నారు. ఇక 2018లో వచ్చిన ‘అంధాదూన్’ అనే సినిమాతో ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. తాజాగా ఆయన తన సినిమా కెరీర్‌ గురించి మీడియాతో మాట్లాడారు. అడల్ట్ కంటెంట్‌ని ప్రేక్షకులు ఒప్పుకుంటారు అని ఆయన ఆరంభంలో భావించలేదు అని పేర్కొన్నారు. అయితే అలాంటి బోల్డ్ కంటెంటే తనని ఇప్పుడు స్టార్ హీరోగా నిలబెట్టింది అని అన్నారు. విక్కీ డోనర్, ఈ రెండు సినిమాలు తనకి ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయని తెలిపారు. అందుకే ఇలాంటి ఢిఫరెంట్ సబ్జెక్టులతోనే సినిమాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయుష్మాన్.. డాక్టర్ జీ, అనేక్ అనే సినిమాల్లో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3DvTbyh
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...