‘లుంగీ డ్యాన్స్’ తదితర పాటలకు సంగీతం అందించడమే కాదు.. ప్రైవేటుగా కూడా ఎన్నో పాటలకు తన గాత్రం అందించడం.. సంగీతం సమకూర్చడం చేశారు.. సంగీత దర్శకుడు.. ర్యాపర్ ‘’. ఆయన చేసిన పాటలకు బాలీవుడ్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. అయితే కొద్ది రోజుల క్రితం హానీ సింగ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తనని హింసిస్తున్నారు అంటూ తన భార్య ఆయనపై కేసు నమోదు చేసింది. ఆమెతో కాకుండా.. ఆయన వేరే అమ్మాయిలతో శారీరక సంబంధం పెట్టుకున్నారు అంటూ ఆమె ఆరోపించింది. చాలా సందర్భాల్లో తనపై మానసికంగా, శారీరకంగా దాడి చేశారు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే దీనిపై గతంలోనే విచారణ జరిగింది. మెజిస్ట్రేట్ తనియా సింగ్ చేపట్టిన ఈ విచారణలో షాలినీ తర్వాత కన్నీరు పెట్టుకొని మరీ తన ఆవేదనను వ్యక్తపరిచింది. గత పది సంవత్సరాలుగా తన భర్తకు ప్రతీ విషయంలో తాను అండగా నిలిస్తే.. ఆయన మాత్రం తనను అసలు పట్టించుకోలేదు అని ఆయన తెలిపారు. అయితే ఈ విచారణ సమయంలో హనీ సింగ్ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆయనపై అనుమానాలు పెరిగిపోయాయి. నేరం చేశారు కాబట్టే ఆయన కోర్టుకు హాజరుకాలేదు అని అంతా భావించారు. కానీ, ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని.. అందుకే కోర్టుకు రాలేకపోయారు అని ఆ సమయంలో ఆయన తరఫున లాయర్లు కోర్టుకు వివరించారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం.. అతని హెల్త్ రిపోర్ట్తో పాటు.. ఇన్టాక్స్ రిపోర్టులు కూడా సమర్పించాలని ఆదేశించింది. అయితే శుక్రవారం హనీ సింగ్ ఎట్టకేలకు ఈ కేసుకు సంబంధించి బయటకు వచ్చారు. ఆయన లాయర్తో కలిసి ఢిల్లీ తిస్ హజారీ కోర్టు ఎదుట హాజరు అయ్యారు. ఇక హనీ సింగ్ లాయర్ ఆయన తరఫున వాదనలు వినిపించారు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలని.. రూ.20 కోట్లు నష్టపరిహారం ఇప్పించాలని.. షాలినీ డిమాండ్ చేస్తున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3jDMthM
v
No comments:
Post a Comment